Naivedhyam : దేవుడికి నేవేద్యంగా ఈ పండ్లను పెడితే ఎలాంటి ఫలితం దక్కుతుంది…!!
మనం సాధారణంగా గుడికి ఖాళీ చేతులతో వెళ్లం. కొబ్బరికాయ...పండ్లు...పువ్వులు...పూజా సామాగ్రిని తీసుకుని వెళ్తాం. అలా వెళ్తే మనస్సు కూడాఎంతో సంతోషంగా ఉంటుంది.
- By hashtagu Published Date - 08:40 AM, Sat - 25 June 22
మనం సాధారణంగా గుడికి ఖాళీ చేతులతో వెళ్లం. కొబ్బరికాయ…పండ్లు…పువ్వులు…పూజా సామాగ్రిని తీసుకుని వెళ్తాం. అలా వెళ్తే మనస్సు కూడాఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఏ పండును ఆ భగవంతుడిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతాం. తెలుసుకుందాం.
అరటిపండ్లు:
అరటిపండును నైవేద్యంగా పెడితే…నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.
అరటిగుజ్జు:
బుుణవిముక్తికోసం…రావాల్సిన సొమ్ముకోసం…నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పెళ్లి తదితర శుభకార్యాలయాలకు సకాలంలో నగదు అందుతుంది.
కొబ్బరికాయ:
పనులు సులభంగా పూర్తవుతాయి. అనుకున్న రీతిలో పనులు నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తవు.
సపోటాపండు:
వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు దాదాపుగా తొలగిపోతాయి. సంబంధాలు ఖాయం అవుతాయి.
కమలాఫలం:
చిరకాలంగా నిలిచిపోయిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు మీకు సహాయపడతారు.
మామిడిపండు:
వినాయకుడికి మామిడిపండు సమర్పిస్తే…ఇంటికి సంబంధించిన నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. గణపతిహోమం చేయించి పండును పూర్ణాహుతి చేయిస్తే…కొన్ని వ్యవహారాలు చక్కబడతాయి. మీ ఇష్టదైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచండి. మోసం చేసినవారిలో మార్పు మొదలవుతంది.
నేరేడుపండు:
నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే…నీరసం, నిస్సత్తువ తగ్గుతుంది. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాల్ల నొప్పులు తగ్గుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం పోతుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డించినట్లయితే…అన్న పానీయాలకు లోటు ఉండదు. రోజూ నేరేడు పండును తింటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.
యాపిల్ పండు:
సకల రోగాలు, సర్వకష్టాలు తొలగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. దరిద్రం బాధ ఉండదు.
ద్రాక్షపండ్లు:
ఈ పండ్లను దానం చేస్తే పక్షపాత రోగాలు నయమవుతాయి . దేవుడికి నైవేద్యంగా పెడితే సుఖసంతోషాలు కలుగుతాయి.
జామపండు:
జామపండును నైవేద్యంగా సమర్పిస్తే…సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగిపోతాయి. వివాహాం కానీ యువతులతో ముత్తయిదువులకు పసుపుబొట్టు పెట్టిస్తే పెళ్లి ఆటంకాలు తొలగిపోతాయి. జామ, కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి. గణపతికి పంచామ్రుత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటికగా సాగుతుంది.
Tags
Related News
Fruits: పరగడుపున ఈ పండ్లను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అన్న విషయం తెలిసిందే. వైద్యులు కూడా తరచూ తాజా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సీజనల్ ప్రకారంగా లభించే పండ్లను తప్పకుండా తినాలని చెబుతూ ఉంటారు. ఇకపోతే చాలామందికి పండ్లను ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తినాలి అన్న విషయాలు తెలియదు. అందులో కొందరు నిద్ర లేచిన తర్వాత అంటే పరగడుపున పండ్లను తీసుకుంటు ఉంటారు. కానీ అలా తీ�