Tossing Coins In River: నదులు, కోనేరు లలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
హిందూ సంప్రదాయంలో ఇప్పటికీ చాలామంది ఎన్నో రకాల పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. అలాగే ఎన్నో రకాల నియమాలను కూడా అనుసరిస్తున్నారు. వాటి వెనుక ఉన్
- By Nakshatra Published Date - 09:50 PM, Wed - 21 June 23
హిందూ సంప్రదాయంలో ఇప్పటికీ చాలామంది ఎన్నో రకాల పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. అలాగే ఎన్నో రకాల నియమాలను కూడా అనుసరిస్తున్నారు. వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కోణం చాలామందికి తెలియకుండానే పూర్వం పెద్దలు పాటించేవారు మేము కూడా పాటిస్తున్నాము అని చెబుతూ ఉంటారు. పూర్వం పెద్దలు పాటించే వాటి వెనుక సైన్స్ తో పాటు ఆధ్యాత్మికత కూడా దాగిఉంది. మామూలుగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండే నదులు కోనేరులలో నాణేలు వేసి నమస్కారం చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద అని తీయడం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నదులు కోనేరులలో నాణేలు వేసి నమస్కారం చేస్తూ ఉంటారు.
అలా ఎందుకు చేస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు. మరి కోనేరు చెరువులలో నదులలో నాణేలు వేయడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు, నది, సరస్సుల్లోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరుతారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలు వేస్తుంటారు. అయితే నదుల్లో వేయాల్సింది ఇప్పుడు చలామణిలో ఉన్న నాణేలు కాదు రాగి నాణేలు వేయాలి. ఇప్పుడున్న రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు ఇనుముతో తయారుచేసినవి.
కానీ అప్పట్లో నాణేలన్నీ కేవలం రాగితోనే తయారు చేసేవారు. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసేవారు. రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమయింది. అందుకే రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల తాగునీటిలో ఎలాంటి కలుషితాలు ఉన్నా కూడా తొలగిపోతాయని అలా చేసేవారు. పైగా అప్పట్లో అంతా నదుల్లో నీటిని నేరుగా తాగేవారు. ఇప్పటిలా ఫిల్టర్లు లేవు. అందుకే రాణి నాణేలు వేసి నీటిని శుభ్రపరిచేవారు. ఇప్పుడున్న నాణేలు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సరికదా మరింత నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇకనుంచైనా ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇనుప నాణేలు నీటిలో వేయొద్దు. రాగి నాణేలు దొరికితే మాత్రం నిరభ్యంతరంగా వేయండి.
Related News
Health Report: భయపెడుతన్న అలర్జీలు.. అలర్ట్ గా ఉండకపోతే అంతే సంగతులు
Health Report: విపరీతమైన వేడి, వాతావరణంలో మార్పుల కారణంగా, చాలా మంది ప్రజలు ఏదో ఒక రకమైన అలర్జీకి గురవుతారు. భారతదేశంలో 30 శాతం మంది ప్రజలు అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏదో ఒక రకమైన అలర్జీతో బాధపడుతున్నారు. దాదాపు 26% మంది అలెర్జీలు కలిగి ఉన్నారు. నివేదిక ప్రకారం, వాతావరణం మారినప్పుడు అలెర్జీలు తరచుగా సంభవిస్త