Lakshmi Devi: పర్సులో ఈ ఒక్క వస్తువు పెట్టుకుంటే చాలు.. కాసుల వర్షమే?
సాధారణంగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య
- By Nakshatra Published Date - 06:00 AM, Thu - 15 December 22
సాధారణంగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో రకాల మార్గాలు, పరిహారాలు చెప్పబడ్డాయి. అలాగే ప్రతి ఒక్కరూ రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ శ్రమిస్తూ డబ్బులను సంపాదిస్తూ దాంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కోరుకుంటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంత శ్రమించినప్పటికీ ఫలితం దక్క పోవడంతో నిరాశ చెందుతూ ఉంటారు. అందుకోసం కొన్ని రకాల పరిహారాలను పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుకుందాం..
శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వల్ల తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులతో పూజ చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. మన వాలెట్ లేదా పర్సులో ఒక వస్తువును ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మెరుగ్గా ఉంటాయి. మరి పర్సులో ఉంచుకోవలసిన వస్తువు బంగారం లేదంటే వెండి నాణెం. బంగారం లేదా వెండి నాణెం ను పర్సులో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుంది.
వాస్తు శాస్త్ర ప్రకారం శుక్రవారం రోజున మీరు మీ పర్స్ లేదా వాలెట్ లో బంగారం ,వెండి నాణేన్ని ఉంచుకోవాలి. అయితే మీ పర్సులో బంగారు ,వెండి నాణేన్ని ఉంచుకునే ముందు లక్ష్మీ దేవిని పూజించాలి. ఆ వెండి లేదా బంగారు నాణే మీ పర్సులో పెట్టుకోవడానికి కంటె ముందు లక్ష్మీదేవి యొక్క పటం లేదా విగ్రహం దగ్గర ఆమె పాదాల వద్ద ఉంచి పూజ చేసి అనంతరం ఆ నాణెం ను మీ పర్సు లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే జీవితంలో మీకు డబ్బు సమస్యలు కూడా రావు. అయితే అంతకంటె ముందు పర్సులో బంగారం ,వెండిని ఉంచే ముందు లక్ష్మీ దేవిని పూర్తి ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలని ,పేదలకు సహాయం చేయాలి. అలాగే వారికి ఆహారం పెట్టాలి. శుక్రవారం రోజున దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
Tags
Related News
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం.. మనం ధనవంతులం కావాలంటే..!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సనాతన ధర్మంలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఇందులో ప్రతి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది.