Raavi Leave: రావిఆకుతో అలా చేస్తే చాలు.. ఎలాంటి వ్యక్తైన సొంతం కావాల్సిందే?
మామూలుగా చాలా మంది రావి ఆకుతో వశీకరణ చేసుకోవచ్చు. మనకు కావాలి అనుకున్న వారిని మనం సొంతం చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. మరి నిజంగానే రావి
- By Nakshatra Published Date - 09:00 PM, Sun - 6 August 23
మామూలుగా చాలా మంది రావి ఆకుతో వశీకరణ చేసుకోవచ్చు. మనకు కావాలి అనుకున్న వారిని మనం సొంతం చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. మరి నిజంగానే రావి ఆకుతో ఒక మనిషిని వశీకరణ చేసుకోవచ్చా? ఇందులో నిజం ఎంతో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రావి ఆకుతో చేసే వశీకరణ చాలా శక్తివంతమైన ప్రక్రియ. కోరుకున్న వ్యక్తులను ఎవరినైనా వశపరచుకోవచ్చు. బంధాలను బల పరుచుకోవడానికి ఈ వశీకరణం ఉపయోగిస్తారు. చెడు ఉద్దేశంతో చేస్తే తిరిగి చెడు జరుగుతుంది. ఈ వశీకరణ దేవుళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది.
కనుక మంచి కోసమే ఉపయోగించాలి. ఈ వశీకరణాన్ని శుక్రవారం, ఆదివారం రోజుల్లో మాత్రమే ఆచరించాలి. ఇందుకోసం ముందుగా ఉదయాన్నే రావి చెట్టు దగ్గరికి వెళ్లాలి. రావిచెట్టుకు ఉత్తర భాగాన మీరు తూర్పు ముఖాన నిల్చొని ఉత్తర భాగం నుంచి ఒక ఆకును తెంపి తీసుకోవాలి. ఏ వ్యక్తి మీకు దూరం అయ్యారో ఆ వ్యక్తి పేరు, తన తల్లిదండ్రుల పేర్లు ఆకు పై భాగాన అంటే ఆకు తెంపిన భాగాన రాయాలి. దాని కింది భాగంలో మీ పేరు మీ తల్లిదండ్రుల పేర్లు రాయాలి. ఒక యాలకును మీ చేతిలోకి తీసుకుని ఏ వ్యక్తి దగ్గర కావాలో ఆ వ్యక్తి పేరు 7సార్లు7 చెప్పి ఆ యాలకును నోటితో ఊదాలి.
తరువాత ఆ వ్యక్తి పేరు ఎక్కడ రాశారో ఆ పేరు మీద యాలకును పెట్టాలి. మరో యాలకును తీసుకుని 7సార్లు మీ పేరును తలచుకొని నోటితో ఊదాలి. ఈ యాలకును మీ పేరు మీద పెట్టాలి. యాలకులతో ఏవిధంగా చేశారో లవంగాలతో కూడా అదే విధంగా చేయాలి. ఆపై కొంచెం ఎర్ర కుంకుమను తీసుకుని మీ మనసులోని కోరికలు తలుచుకుంటూ యాలకులపై, లవంగాలపైన వేయాలి. 2నిమిషాలు బాగా ధ్యానం చేసుకుంటూ ఆ వ్యక్తి ముఖాన్ని గుర్తుచేసుకొని వారు మరల దగ్గర కావాలని కోరుకోవాలి. ఎరుపురంగు దారంతో రావి చెట్టు ఆకును ముడి వేయాలి. రావి ఆకు నుంచి లవంగాలు, యాలకులు కింద పడకుండా ముడి వేయాలి. 2నిమిషాలు ఈ ఆకును పూజా మందిరంలో పెట్టి ధ్యానం చేసుకోవాలి. ఈ రావి చెట్టు ఆకును పారుతున్న నీళ్లల్లో వదలాలి. ఇలా 7 శుక్రవారాలు 7 ఆదివారాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరుకునే వ్యక్తి మీ సొంతం అవ్వడం ఖాయం.
Related News
Shocking News for Non-Veg Lovers : హైదరాబాద్ లో చికెన్ , మటన్ షాప్స్ బంద్
ఈ ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ వెజ్ షాప్స్ క్లోజ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు