Pooja: నిత్య పూజా ఎలా చేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
సాధారణంగా చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే నిత్య దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. మర
- By Nakshatra Published Date - 07:39 PM, Fri - 30 June 23
సాధారణంగా చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే నిత్య దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. మరి నిత్య పూజ ఎలా చేయాలి? ఇటువంటి నియమాలను పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆసనం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా నిలబడి పూజ చెయ్య కూడదు. చక్కగా కూర్చుని పూజ చేయాలి. పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం. కనుక పూజలో తర్పణ తప్పనిసరి. గంధం అంతులేని దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేసేది, ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది.
కనుక గంధం కూడా తప్పకుండా పూజలో వినియోగించాలి. అక్షత అంటే పవిత్రమైందని అర్థం. కల్మషాలను పోగొట్టేవి కనుక అక్షతలు కూడా పూజా ద్రవ్యాల్లో ఉండాలి. పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చేది. కనుక పువ్వు లేని పూజ పూర్తికాదని అంటుంటారు. భగవంతుడికి కనీసం ఒక్క పువ్వునైనా సమర్పించాలి. ధూపం దుర్వాసనలను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టిస్తుంది. కనుక ధూపాన్ని కూడా తప్పకుండా భగవంతుడికి సమర్పించుకోవాలి.
దీపం అజ్ఞాన అందకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందించేది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేల్కొలిపే సాధనం. ఏం చేసినా లేకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవడం వల్ల సమస్త బాధలు దూరమవుతాయట.
ఆరు రుచులతో, నాలుగు విధాల పదార్థాలను భగవంతుడికి తృప్తినిచ్చే దానిని నివేదించడాన్ని నైవేద్యంగా చెబుతారు. దేవుడికి సమర్పించిన సాదం అనగా ఆహారం ప్రసాదం. సామరస్యానికి, పరతత్వానికి ప్రతీక. లవంగ, జాజి, పచ్చకర్పూరం వంటివి కలిపిన ద్రవ్యాన్ని ఆచమనీయం అంటారు. పూజ మొదలయ్యే ముందు భగవంతుని పూజకు ఆహ్వానించడాన్ని ఆవహానంగా చెబుతారు. భగవంతుని పూజకు ఆహ్వానించి కుశలం కనుక్కోవడాన్ని స్వాగతం అంటారు. పాదాలు కడుక్కునేందుకు ఇచ్చే జలాన్ని పాదోపాద్యం అంటారు.తేనె, నెయ్యి, పెరుగుల మిశ్రమమం మధుపర్కం. గంధం, కస్తూరి, అగరుతో కూడిన జలంతో భగవంతుడికి చేసే సేవ స్నానం. వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, చేతులు నేలకు తాకించి చేసే వందనం సాష్టంగ నమస్కారం. ఇలా ఆహ్వానించిన దేవుడికి పదాహారు ఉపచారాలతో పూజించి తిరిగి పంపడాన్ని ఉద్వాసన అంటారు. పూజ అంటే పూర్వజన్మ వాసనలు పోగొట్టేది. అర్చన అంటే అభిష్ట ఫలాన్ని నెరవేర్చేది. జపం అంటే జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది. స్తోత్రం అంటే మనస్సును ఆనందింప జేసేది. ధ్యానం ఇంద్రియ నిగ్రహాన్ని అందించేది. ధీక్ష దివ్య భావాలు కలిగించేది. పాపాలను పోగొట్టేది. అహంభావాన్ని పోగొట్టేది, ఆనందాన్ని ఇచ్చేది ఆభిషేకం.
Related News
Yogi: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. యోగి ఆగ్రహం
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి(Ram Navami) వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. సనాతన నమ్మకాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భక్తులపై దాడులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్న�