House Warming Ceremony: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాలు పొంగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?
మామూలుగా మనం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పాలు పొంగించడం అన్నది సహజం. కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు గృహ ప్రవేశ పూజ చేస్తారు. గృహ ప్రవేశ
- By Nakshatra Published Date - 03:36 PM, Sun - 25 February 24
మామూలుగా మనం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పాలు పొంగించడం అన్నది సహజం. కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు గృహ ప్రవేశ పూజ చేస్తారు. గృహ ప్రవేశం అనేది ఒక హిందూ ఆచారం. ఇక్కడ ఒక వ్యక్తి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు ఒక శుభ సమయంలో పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. గృహ ప్రవేశ పూజ వేడుక ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు నిర్వహించబడే హిందూ పూజా కార్యక్రమం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. శుభ ముహూర్తంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జీవితం సుఖ సంతోషాలు నిండి ఉంటాయని విశ్వాసం.
ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కుటుంబ సభ్యుల సమస్యలు తేలికవుతాయని నమ్మకం. గృహ ప్రవేశ పూజ రోజున పాలు పొంగించడం..ఇల్లు వేడెక్కుతున్న సమయంలో స్త్రీలు కొత్త ఇంటి వంటగదిలో కొత్త పాత్రలో పాలు కాచాలని మత విశ్వాసం. అప్పుడు ఈ మరుగుతున్న పాలలో బియ్యం చేర్చి క్షీరాన్ని ప్రసాదంగా తయారు చేస్తారు. ఇది పూజ చేసే సమయంలో నైవేద్యంగా సమర్పించబడుతుంది. తరువాత అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. సాంప్రదాయ భారతీయ హౌస్ వార్మింగ్ వేడుకకు పాలు మరిగించడం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. కొత్త పాత్రలో పాలు పొంగించడం హిందూ సంప్రదాయం, ఆచారంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం గృహ ప్రవేశ సమయంలో పాలు పొంగిస్తే ఇంటిలో సుఖ సంతోషాలు కూడా అలా పొంగుతూ ఉంటాయని విశ్వాసం.
క్షీరాన్నం చేస్తారు. పొంగిన పాలల్లో బియ్యం, బెల్లంవేసి తయారు చేస్తారు. దీనిని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గృహప్రవేశం సమయంలో పాలు పొంగితే ఆ ఇంటిపై ఇంటి సభ్యులపై దేవుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం. అందుచేత కొత్త ఇంట్లోని వంటగదిలో తప్పనిసరిగా పాలు పొంగించాలి. కొత్త ఇంట్లో అడుగు పెట్టె సమయంలో పాలు పొంగిచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుందని నమ్ముతారు. అలాగే గృహ ప్రవేశం పూజ రోజున కొత్త వంటశాలో కొత్త పాత్రలో పాలు పోసి ముందుగా వాయువుకు పూజ చేసి ఆ తర్వాత పాలు మరిగించాలి. పాలు పొంగిన తర్వాత క్షీరాన్నం తయారు చేసి సత్యనారాణ వ్రత కథ పూజలో దేవతకు నైవేద్యంగా సమర్పించాలి. హోమం పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణులకు కూడా పరమాన్నం ప్రసాదంగా పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆహూతులకు ప్రసాదంగా పంచాలి.
Related News
Milk: ఎక్కువసేపు పాలను మరిగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మామూలుగా చాలామంది స్త్రీలు పాలను ఎక్కువ సేపు మరిగిస్తూ ఉంటారు. పాలు పచ్చివాసన పోయే పోవాలని ఎక్కువసేపు మరగబెడితే మరికొందరు పాలపై మీగడ బా