Ganesh Chaturthi 2022: 300 ఏళ్ల మహా సంయోగం వేళ.. వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్!!
ఈసారి వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. పది రోజులపాటు జరిగే గణేశుడి ఉత్సవాల సమయంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శని వంటి ముఖ్యమైన గ్రహాలు తమ సొంత రాశులలో సంచరించనున్నాయి.
- By Hashtag U Published Date - 01:00 PM, Wed - 31 August 22
ఈసారి వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. పది రోజులపాటు జరిగే గణేశుడి ఉత్సవాల సమయంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శని వంటి ముఖ్యమైన గ్రహాలు తమ సొంత రాశులలో సంచరించనున్నాయి. ఇలా జరగడం 300 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. గణపతి ఉత్సవాలు నేటి నుంచి సెప్టెంబర్ 9 వరకు (మెుత్తం 10 రోజులపాటు) జరుగుతాయి. అనంత చతుర్థి నాడు విష్నేు శ్వరుడి నిమజ్జనం జరుగుతుంది. గణేష్ చతుర్థి సమయంలో కొన్ని పవిత్రమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.
300 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ యాదృచ్ఛికం రోజు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసొస్తుంది. కొత్త ఇల్లు కొనడం, బుక్ చేసుకోవడం, నగలు, కారు వంటి విలువైన వస్తువులను కొనడం లేదా బుక్ చేసుకోవడం చాలా మంచిదిగా భావిస్తారు. షాపింగ్ చేయడానికి శుభప్రదం. దేశంలో చాలా చోట్ల గణేష్ చతుర్థిని అబుజ ముహూర్తంగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి.
పూజ ఇలా..
వినాయక చవితి రోజున స్వామిని ఒక ప్రత్యేక రూపంతో ఆరాధిస్తారు. ఇతర రోజులలో పసుపుతో వినాయకుని చేసి పూజిస్తారు. సంపన్నులే కాక సామాన్యులు కూడా భక్తితో చేసుకొనే విశేషమైన పండుగ మన వినాయకచవితి. సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా మొదలుపెట్టిన పనులు విజయవంతం కావాలని సకల విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కుటుంబ సమేతంగా పూజిస్తుంటాం. గణపతి పృథ్వీతత్త్వానికి సంకేతం. అందువల్ల బంగారం, వెండి, రాగి ప్రతిమలతో పూజ చేసినా మట్టి వినాయకునికి పూజ చేస్తేనే స్వామికి సంతృప్తి కలుగుతుంది.
పూజా వస్తువులు..
దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠం.
నైవేద్యం..
ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి.
పూజకు ఏర్పాట్లు ..
ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపు కుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.
Related News
Vinayaka Chavithi: వినాయక చవితి రోజు గణేశుడికి 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారో తెలుసా?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి పండుగ రోజు చాలామంది ఇంట్లో బయట భారీ విగ్రహాలను ఏ