Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?
భారతీయులు ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం చేస్తుంటారు. కూర్చునే దగ్గర నుంచి పడుకునే వరకు అన్నింటిని సంప్రదాయపద్దతి ప్రకారం చేస్తుంటారు.
- By hashtagu Published Date - 05:39 AM, Thu - 7 July 22
భారతీయులు ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం చేస్తుంటారు. కూర్చునే దగ్గర నుంచి పడుకునే వరకు అన్నింటిని సంప్రదాయపద్దతి ప్రకారం చేస్తుంటారు. భోజనం విషయానికిరియ బ్రాహ్మణం చెబుతోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా దక్కుతుందట.
ఇక భోజనం చేసేటప్పుడు తూర్పుదిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని తైత్తిరియా బ్రాహ్మణం వివరిస్తోంది. అంతేకాదు దక్షిణదిశగా తిరిగి భోజనం చేస్తే కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరంవైపు తిగిరి భోజనం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపునకు కూర్చుని భోజనం చేయకూడదని పురాణాల్లో ఉంది. అందుకే ఎక్కువ మంది తూర్పు దిక్కున కూర్చోని భోజనం చేస్తుంటారు.
ఇక ఆకులు, ఇనుప పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు. డబ్బును ఆశించేవాడు మట్టి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకుల్లో మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందు, తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. కానీ నియమాలను అనుసరించకుండా ఎలా పడితే అలా భోజనం చేస్తే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు రావొచ్చు. తినేటప్పుడు పద్దతిగా తింటే మంచిది.
Related News
TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన
TTD: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన�