Lakshmi Devi: ప్రతిరోజూ ఇలా చేస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం?
ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంట
- By Nakshatra Published Date - 08:00 PM, Wed - 19 July 23
ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఎటువంటి ఫలితాలు కనిపించకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. డబ్బులు సంపాదించాలని, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఎంత డబ్బు సంపాదించినా మిగలకపోగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు పండితులు. లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతి రోజు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం. దేవారాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాగా కర్పూరం వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా వెలుగొందింది. కర్పూరం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో రోజూ కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. ముక్కోటి దేవతలు అందరూ నివసించే జంతువుగా ఆవు పరిగణించబడుతుంది.
ఈ గోమాతకు రోజూ ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి. జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజూ పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిది. ప్రతిరోజూ పక్షులకు ధాన్యాలు తినిపిస్తే, జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి మరియు శ్రేయస్సు ఉంటుంది. సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్వడం మానుకోవాలి. లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావచ్చు.
Related News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.