HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Akshaya Tritiya Rituals For Wealth And Prosperity

Akshaya Tritiya: మీ సంపద మరింత పెరగాలి అంటే అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేయాల్సిందే!

మీ సంపద రెట్టింపు అవ్వాలి అంటే అక్షయ తృతీయ రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

  • Author : Anshu Date : 25-04-2025 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akshaya Tritiya
Akshaya Tritiya

అక్షయ తృతీయ పండుగను హిందువులు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది అనగా 2025 లో అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోనున్నారు. హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైన ముహూర్తంగా భావిస్తారు. అయితే అక్షయ తృతీయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. ఈ రోజున బంగారం కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజున బంగారం కాకుండా ఏం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మరి సంపద పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అక్షయ తృతీయ హిందూ ధార్మికంగా ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే దానాలు, పుణ్య కార్యాలు ఎప్పటికీ అక్షయంగా ఫలిస్తాయని విశ్వాసం ఉంది. అక్షయ తృతీయ రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి తన భక్తులతో సంతోషిస్తే, వారికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించి, సంపదకు కొత్త దారులు తెరుస్తుందట. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి కుంకుమ, పసుపు తిలకం దిద్దాలని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున,అవసరంలో ఉన్నవారికి నీటితో నిండిన మట్టికుండ దానం చేయాలట.

దేవాలయానికి కూడా దానం చేయవచ్చట. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందట. అంతేకాకుండా ఈ రోజున మట్టి నీటి కుండను ఇంటికి తెచ్చుకున్నా కూడా ఆ ఇంట శుభం జరుగుతుందట. అక్షయ తృతీయ రోజున పితృదేవతలకు నైవేద్యం సమర్పిస్తారట. ఇలా చేయడం వల్ల జాతకంలోని పితృదోషం తొలగి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే అక్షయ తృతీయ రోజున విసనకర్ర, గొడుగు, పంచదార, శనగపిండి దానం చేయాలట. అక్షయ తృతీయ రోజున మీ ఇంటి పూజగదిలో ఏకాక్షి కొబ్బరికాయ ఉంచాలట. దీంతో తల్లి లక్ష్మీదేవి సంతోషించి, భక్తుల జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshaya Tritiya
  • Akshaya Tritiya 2025
  • Akshaya Tritiya festival
  • money

Related News

    Latest News

    • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

    • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

    • ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?

    • భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

    • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

    Trending News

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

      • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

      • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

      • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd