COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 17,073 పాజిటివ్ కేసులు నమోదు
- By Prasad Published Date - 11:15 AM, Mon - 27 June 22
భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అలజడి సృష్టిస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఈ రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,06,046 కు చేరింది. ప్రస్తుతం దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 94,420 కు చేరింది. దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.11 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 21 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,020 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,208 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,27,87,606 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,97,11,91,329 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.