Trivikram and Pooja Hegde: బుట్టబొమ్మ మాయలో గురూజీ.. పూజహెగ్డేకు కార్ ఆఫర్!
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) సమంత తర్వాత ఇష్టపడే హీరోయిన్ పూజా హెగ్డే.
- By Balu J Published Date - 03:48 PM, Tue - 28 February 23
కెమిస్ట్రీ (Chemistry) అనే పదం వినిపించగానే ఏ హీరో, హీరోయిన్ గుర్తుకువస్తారు. కానీ ఇప్పుడు ఈ లిస్టులో హీరోయిన్ తో పాటు డైరెక్టర్స్ పేరు కూడా గుర్తుకువస్తోంది. అందుకు కారణం డైరెక్టర్, హీరోయిన్ మధ్య మంచి ర్యాపో ఉండటం.. ఇద్దరి కలయికలో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉండటం. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) సమంత తర్వాత ఇష్టపడే హీరోయిన్ పూజా హెగ్డే. మహేష్ బాబు సరసన తాజా చిత్రంతో సహా అతని వరుస చిత్రాలలో ఆమె ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే చిత్రంలో ఆమె నటిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో పూజా షూటింగ్ ప్రారంభం కానుంది. మహేష్-త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ రన్ అవుతోంది. పూజా తారాగణంలో చేరడంతో త్వరలో కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. పూజను సంతోషపెట్టేందుకు యూనిట్ కొత్త కారును కొనుగోలు చేస్తోంది. షూటింగ్ సమయంలో ఈ కారును పూజ ప్రత్యేకంగా ఉపయోగించనున్నారు.
హీరోలు ఇలాంటి ఆఫర్స్ అందుకోవడం మామూలే అయినా యూనిట్ మాత్రం పూజా సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. కారును అద్దెకు తీసుకోవడానికి ఖర్చులు ఉంటాయి. అందుకే కొత్త కొనుగోలు చేశారట. అయితే ఈ ఖర్చు సినిమా బడ్జెట్లో ఉంటుంది. కానీ పూజా రెమ్యునరేషన్లో నుంచి కాదు. ఇక బుట్టబొమ్మ కొత్త కారుతో ఆనందంలో మునిగిపోయిందట. అయితే త్రివిక్రమ్ (Trivikram) తన సినిమాల్లో వరుసగా పూజానే ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నాడు? అనేది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Nara Lokesh: కట్టేది చంద్రబాబు.. కూల్చేది జగన్ రెడ్డి: నారా లోకేశ్
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�