Telugu Movies: ఈ వారం థియేటర్ ఓటీటీ లలో విడుదల కానున్న సినిమాలు ఇవే?
ప్రతి వారం ఓటీటీలో, థియేటర్లలో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ప్రతివా
- By Nakshatra Published Date - 03:37 PM, Mon - 8 May 23
ప్రతి వారం ఓటీటీలో, థియేటర్లలో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమా వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ వివరాలు వెళితే.. థియేటర్లో రిలీజయ్యే సినిమాల విషయానికి వస్తే.. మే 12వ నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చత్రపతి హిందీ సినిమా కూడా మే 12న విడుదల కానుంది.
ఈ రెండు సినిమాలతో పాటు భువన విజయమ్,ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్, కళ్యాణమస్తు, మ్యూజిక్ స్కూల్ సినిమాలు మే 12వ తేదీన థియేటర్ లలో విడుదల కానున్నాయి. కాగా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్ల విషయానికి వస్తే.. ఆహాలో న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వస్తే..దహాద్, ఎయిర్ అనే సినిమాలో మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ గా ఉన్నాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ది మప్పెట్స్ మేహెమ్ అనే వెబ్ సిరీస్ మే 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే స్వప్నసుందరి సినిమా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..
క్వీన్ క్లియోపాత్ర సినిమా మే 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే రాయల్ టీన్, ప్రిన్సెస్ మార్గరెట్ హాలీవుడ్ మూవీ మే 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎరినీ సినిమా మే 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది మదర్ సినిమా కూడా మే 12 స్ట్రీమింగ్ కానుంది. క్రాటర్, అలాగే బ్లాక్ నైట్ అనే వెబ్ సిరీస్ కూడా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే జీ5 విషయానికి వస్తే తాజ్: ది రీన్ ఆఫ్ రివేంజ్ రెండో సీజన్ వెబ్ సిరీస్ మే 12 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. కాగా సోనీలివ్ లో ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్ సినిమా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమాలో విక్రమ్ వేద సినిమా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Related News
Delhi Excise Policy Case: కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకుఇప్పుడప్పుడే కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఈ కేసులో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నుంచి సీబీఐ కస్టిడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉన్నారు