MS Dhoni and Mahesh Babu: బాక్సాఫీస్ బద్దలే.. మహేశ్, విజయ్ లతో ధోని సినిమా, క్రేజీ కాంబినేషన్ ఫిక్స్!
పరిచయం అవసరం లేని పేరు ఎంఎస్ ధోనీ. ఎందుకంటే భారత క్రికెటర్ కెప్టెన్గా అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లను గెలుచుకున్నాడు.
- By Balu J Published Date - 01:02 PM, Fri - 14 October 22
పరిచయం అవసరం లేని పేరు ఎంఎస్ ధోనీ. ఎందుకంటే భారత క్రికెటర్ కెప్టెన్గా అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లను గెలుచుకున్నాడు. MS ధోని ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. సెకండ్ ఇన్సింగ్ లో భాగంగా క్రియేటివ్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎంఎస్ ధోని మొదటి ప్రొడక్షన్ తలపతి విజయ్, మహేష్ బాబులతో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అనేక ప్రముఖ నిర్మాణ సంస్థల మాదిరిగానే.. MS ధోని కూడా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నాడు.
ప్రముఖ క్రికెటర్ దక్షిణాదికి చెందిన మోస్ట్ వాంటెడ్ కాంబోని తీసుకురావడం ద్వారా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపేలా బిగ్ ప్లాన్ వేశాడు. తన మొదటి ప్రొడక్షన్లో విజయ్, మహేష్ బాబులతో సినిమా చేసి, క్రికెట్ లో మాదిరిగా సినిమా ఫీల్డ్ లోనూ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. MS ధోని మొదటి ప్రొడక్షన్ కోసం చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయొచ్చు. విజయ్, మహేష్ బాబు ఇద్దరూ సూపర్ స్టార్స్. తమిళంలో విజయ్ స్టార్ హీరో అయితే, తెలుగులోనూ మహేశ్ బిగ్ హీరో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ధోని. ఈ స్టార్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నందున, MS ధోని సినిమా నిర్మాతగా అరంగేట్రం చేయడానికి ఒక సంవత్సరం పట్టవచ్చు. అయితే విజయ్ తో మహేశ్ కు మంచి స్నేహం ఉంది. ఒక్కడు, పోకిరీ సినిమాలను తమిళంలో రిమేక్ చేసి హిట్ కొట్టాడు విజయ్.
Related News
200 Sixes in IPL: ఐపీఎల్ లో వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజూ
ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి భారతీయుల రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడు సంజూ శాంసన్.