Surveen Chawla : సౌత్ లోనూ ‘కాస్టింగ్ కౌచ్’.. నిజాలను బయటపెట్టిన నటి!
కాస్టింగ్ కౌచ్... బాలీవుడ్, కొలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. అన్నీ ఇండస్ట్రీల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జూనియర్ ఆర్టిస్టుల నుంచి మెయిన్ హీరోయిన్ల వరకు ఏదో ఒక సందర్భంలో కౌస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు వార్తాలు కూడా వచ్చాయి.
- By Balu J Published Date - 03:40 PM, Wed - 15 December 21
కాస్టింగ్ కౌచ్… బాలీవుడ్, కొలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. అన్నీ ఇండస్ట్రీల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జూనియర్ ఆర్టిస్టుల నుంచి మెయిన్ హీరోయిన్ల వరకు ఏదో ఒక సందర్భంలో కౌస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు వార్తాలు కూడా వచ్చాయి. తాజాగా ఓ నటి తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నూ కాస్టింగ్ కౌచ్ వ్యవహరం నడిచిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఎదుర్కొందని నటి సుర్వీన్ చావ్లా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో సుర్వీన్ ముంబైలో తన మొదటి సినిమా మీటింగ్లో బాడీ-షేమ్కు గురైనట్లు తెలిపింది. 56 కిలోల బరువున్న తనకు పాత్రలు రావని చాలామంది విమర్శించినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. RJ సిద్ధార్థ్ కన్నన్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాడింగ్ షేమ్ కు గురయ్యారా అని ప్రశ్నించగా.. సుర్వీన్ బదులిస్తూ, “బాంబేలో నేను వెళ్ళిన నా మొదటి సినిమా మీటింగ్ ఇది. ఆడిషన్స్, అవకాశాల పేరుతో కాస్టింగ్ కౌచ్ కు దిగారు. ఓ సందర్భంలో నా నడుము, చెస్ట్ లాంటి ప్రైవేట్ పార్ట్స్ గురించి కామెంట్ చేశారు. నాకు మాత్రమే కాకుండా.. చాలా మంది మహిళలకు జరుగుతుంది. అవకాశాల పేరుతో బరువును, నడుమును, ఛాతీ పరిమాణం లాంటి విషయాల గురించి ప్రశ్నించారు. కౌస్టింగ్ కౌచ్ అనేది పిచ్చి చర్య. కౌస్టింగ్ కౌచ్ పేరుతో పరిమితులు విధించడం సరికాదనీ, సౌత్ లోనూ కాస్టింగ్ కౌచ్ వ్యవహరం నడుస్తోందని’’ సమాధానమిచ్చింది.
సుర్వీన్ చావ్లా కహిన్ తో హోగా (2003)తో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. తరువాత కసౌతి జిందగీ కే (2004) కాజ్జల్ (2006)లో కనిపించింది. సూపర్స్టార్స్ హోస్ట్ చేసిన రియాలిటీ డ్యాన్స్ షో ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా (2008)లో కనిపించింది. సుర్వీన్ అనేక చిత్రాలలో కూడా నటించింది.
Related News
KTR: 6 నెలల్లోనే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు: కేటీఆర్
KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరంలో జరిగిన రోడ్ షో పాల్గొని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే ప్రజలు నమ్మి మోసపోయారని, డిసెంబర్ 9 న రుణమాఫీ, బోనస్, కౌలు రైతులు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అని రేవంత్ అన్నారని, బంగారం ఫ్రీ, రూ. 2500, ముసలోళ్లకు రూ. 4 వేలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. అ�