Palani Temple: మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ.. పళని దేవాలయం లో సమంత
సమంత (Samantha) ఆధ్యాత్మిక బాటలో ప్రయాణిస్తోంది. ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి బారిన
- By Maheswara Rao Nadella Published Date - 12:09 PM, Tue - 14 February 23
సమంత ఆధ్యాత్మిక బాటలో ప్రయాణిస్తోంది. ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్టు ప్రకటించిన సమంత చికిత్సతో చాలా వరకు కోలుకుంది. కోలుకుందనడానికి నిదర్శనంగా జిమ్ లో మళ్లీ కసరత్తులు చేస్తున్న వీడియోని విడుదల చేసింది. మయోసైటిస్ వ్యాధిలో కండరాల నొప్పులు వేధిస్తాయి. సమస్య నుంచి ఉపశమనం రావడంతో తిరిగి సమంత సినిమా చిత్రీకరణల్లో పాల్గొననుంది. ఈ క్రమంలో తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని (Palani Temple) సోమవారం దర్శించుకుంది.
ఆలయంలో స్వామి వారిని చేరుకోవడానికి 600 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ప్రతీ మెట్టుపై హారతి కర్పూరం వెలిగించి నడుచుకుంటూ వెళ్లింది. పళని మురుగన్ (Palani Temple) ను అరుళ్మిగు దండయుతపాణి స్వామి అని కూడా పిలుస్తారు. నటి సమంతా వెంట తోటి నటీనటులు, దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. సమంతా నటించిన శాకుంతలం విడుదల కావాల్సి ఉండగా, ఖుషీ సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఇంకా చాలా సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Also Read: Divyavani: సినిమా వాళ్లంటే చులకన దేనికి ?: నటి దివ్యవాణి
Related News
Samantha: అల్లుఅర్జున్ పై భారీ ఆశలు పెట్టుకున్న సమంత.. ఎందుకంటే
Samantha: ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ సమంత రూత్ ప్రభు వ్యూహాత్మకంగా వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమాలో ఈ టాలెంటెడ్ నటి నటిస్తున్నట్లు సమాచారం. పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చే సినిమా కోసం చూస్తున్న సమంత, అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ మూవీ తనకు బెస్ట్ ఛాయిస్ అని నమ్ముతోంది. అల్లు అర్జున్ కు పా�