Bigg Boss 6: కంటెస్టెంట్స్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన బిగ్ బాస్.. శ్రీ సత్య, శ్రీహాన్ ఎమోషనల్!
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరో వారం కెప్టెన్సీ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి లో
- By Nakshatra Published Date - 03:40 PM, Tue - 11 October 22
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరో వారం కెప్టెన్సీ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి కంటెస్టెంట్ల మధ్య ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. ప్రతి సీజన్ లో ఉండే బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ఉద్దేశం ఏమిటంటే.. మనసుకు దగ్గరైన వాళ్లని వదిలి ఇన్ని రోజులు దూరంగా ఉండటం సులభమైన విషయం కాదు. అందుకే ఈవారం ఇంటి సభ్యులకు తమ బ్యాటరీస్ ని రీచార్జ్ చేసుకునే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు సాగడానికి ఈ బ్యాటరీ రీఛార్జ్ అనే టాస్క్ ని అందించాడు బిగ్ బాస్
ఇక ఈ టాస్క్ లో భాగంగా మొదట శ్రీహాన్ని కన్వెన్షన్ రూంలోకి పిలిపించారు బిగ్ బాస్. అప్పుడు వీడియో కాల్, ఆడియో మెసేజ్, ఫుడ్ ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చి అందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలని చెప్పాడు. అందులో ఏ ఆప్షన్ వద్దు అనుకునే అవకాశం లేదని ఒకవేళ వద్దు అనుకుంటే ఆ ఇంటి మొత్తానికి శిక్ష వేయబడుతుంది అని తెలిపాడు బిగ్ బాస్. ఇక అందులో ఒక ఆప్షన్ ని ఎంచుకున్న శ్రీహన్ లోపలికి వెళ్లి బయటకు ఏడుస్తూ వచ్చేసాడు.
శ్రీహన్ ఎంచుకున్న ఆప్షన్ వల్ల బ్యాటరీ 50% పడిపోయింది. అయితే శ్రీహాన్ ఏడ్చినందుకు శ్రీ సత్య కూడా ఎమోషనల్ అయిందో లేదంటే మరేదో కారణం తెలియదు కానీ ఫుల్ ఎమోషనల్ అయిన శ్రీ సత్య నా గుండె మొత్తం బరువెక్కిపోయింది. మా అమ్మ రాత్రి పడుకోదు..అంటూ ఎమోషనల్ అయ్యింది. అప్పుడు సుదీప ఈ సత్య కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చింది.
Related News
YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల
ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.