Alia-Ranbir: రణబీర్, ఆలియా సంచలన నిర్ణయం…ఆ పని తర్వాతే పెళ్లి..!!
బీటౌన్ లో ఇప్పుడు ఆలియా భట్-రణ్ బీర్ కపూర్ పెళ్లి గురించి ఒక్కటే చర్చ నడుస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది...ఎంతమంది అతిథులు వస్తారు..
- By Hashtag U Published Date - 06:00 AM, Tue - 12 April 22
బీటౌన్ లో ఇప్పుడు ఆలియా భట్-రణ్ బీర్ కపూర్ పెళ్లి గురించి ఒక్కటే చర్చ నడుస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది…ఎంతమంది అతిథులు వస్తారు..ఇలా పలు విషయాలపై అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి బట్టలు, నగల దగ్గరి నుంచి హనీమూన్ స్పాట్ వరకు వంటి రకరకాల అంశాలపై బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా…ఏప్రిల్ 14న మూడుముళ్ల బంధంతో ఒకటికానున్న ఈ జంట…పెళ్లి రోజున రిషికపూర్ కోసం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పూజలు చెంబూర్ లోని ఆర్కే హౌస్ లో జరగనున్నాయి. రిషికపూర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెళ్లికి సంబంధించిన అసలు కార్యక్రమాలు మొదలుకానున్నాయి.
రిషికపూర్ ఏప్రిల్ 30, 2020న మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కపూర్ ఫ్యామిలీకి అలియా దగ్గరయ్యింది. రిషికపూర్ ను తన కుటుంబం చాలా మిస్ అవుతుందని ఈ మధ్యే ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ గుర్తు చేశారు. తన తండ్రి గొప్పతనాని గురించి ఆయన వివరించారు. ఎంత కఠినంగా ఉండేవారో…అంత ప్రేమగా మాట్లాడేవారంటూ..తన తండ్రి జ్ణాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 14న తన తండ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే…పెళ్లి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చెంబూర్ లో ఆర్కె హౌజ్ లో జరిగే ఈ పూజా కార్యక్రమానికి ఇరు కుటుంబాలు హాజరవుతాయని సన్నిహితులు చెబుతున్నారు. అయితే వీరి వివాహానికి కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు.
ఇక వివాహం తర్వాత ముంబైలోని తాజ్ కొలాబాలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు అలియా, రణబీర్ కపూర్ ల స్నేహితులు హాజరుకానున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఏప్రిల్ 13న ప్రారంభం కానున్నాయి. పెళ్లి వేడుక కోసం ఆర్కే హౌస్ ఇప్పటికే ముస్తాబైంది. పరిసరాల చుట్టూ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Related News
Tripti Dimri : త్రిప్తి తెలుగు సినిమాలకు నో అనేస్తుందా.. కారణాలు ఏంటి..?
Tripti Dimri బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రికి వరుస అవకాశాలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్