Skanda : రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్.. స్కంద లెక్కలు ఎలా ఉన్నాయంటే..!!
Skanda బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా స్కంద. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.
- By Ramesh Published Date - 11:31 PM, Wed - 27 September 23
Skanda బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా స్కంద. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. బోయపాటి సినిమాకు కావాల్సిన గ్రాండియర్ ఊర మాస్ అప్పీల్ ఈ సినిమా తీసుకొచ్చింది. ట్రైలర్ 1 లో వయిలెన్స్ ఎక్కువైందన్న వార్తలు వచ్చినా రిలీజ్ టైలర్ లో కంటెంట్ ఏంటన్నది చూపించారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను సినిమా తీసేటప్పుడు కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతా తప్ప వన్స్ పూర్తి చేశాక ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటానని బోయపాటి చెప్పిన స్పీచ్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యింది.
రామ్ (Ram) కెరీర్ లో ఫస్ట్ ఊర మాస్ మూవీగా వస్తున్న స్కంద సినిమా విషయంలో ఉస్తాద్ ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అంతేకాదు స్కంద సినిమా రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసింది. రామ్ ఇదివరకు సినిమాలు ఏది చేయలేని బిజినెస్ స్కంద చేసింది. రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ 35 కోట్ల దాకా వసూళ్లు రాబట్టగా.. స్కంద సినిమా దానికి 10 కోట్లు ఎక్కువ అంటే 44 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.
రామ్ కెరీర్ లో ఫస్ట్ టైం 45 కోట్ల బిజినెస్ జరిగింది. అఖండ తర్వాత బోయపాటి శ్రీను (Boyapati Srinu) చేస్తున్న సినిమాగా కావొచ్చు.. రామ్ కెరీర్ లో ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా అని కావొచ్చు కానీ స్కంద సినిమాపై బడ్జెట్ మాత్రం భారీగా పెట్టేశారు. అందుకు తగినట్టుగా బిజినెస్ కూడా జరిగింది.
రామ్ అండ్ బోయపాటి శ్రీను Skanda ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ కూడా సినిమా టార్గెట్ ఏంటన్నది తెలిసింది. కచ్చితంగా రామ్ కెరీర్ లో స్కంద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. సినిమాలో థమన్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్ గా అవుతుందని అంటున్నారు.
Also Read : Bigg Boss 7: ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు.. రిస్క్ ఎవరికంటే..!
Related News
Ram Parasuram : పరశురామ్ కి ఆఫర్ ఇస్తున్న ఇస్మార్ట్ హీరో.. డబుల్ ఇస్మార్ట్ తర్వాత అతనితోనే ఫిక్స్..!
Ram Parasuram ఇస్మార్ట్ హీరో రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ఎక్కువశాతం