Tollywood: ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే.. మమ్మల్ని నెగ్గించడానికి ఎంతో తగ్గి మాట్లాడారు – ‘రాజమౌళి’..!
- By Hashtag U Published Date - 11:35 AM, Sun - 20 March 22
మెగాస్టార్ చిరంజీవి పై సంచలన కామెంట్స్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇందుకు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికైంది. సినీ ఇండస్ట్రీ బాగుకోసం మెగాస్టార్ చేస్తున్న కృషిని రాజమౌళి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జగన్ సర్కార్ పది నెలల క్రితం సినిమా టికెట్ ధరలు తగ్గించినప్పుడు, ఇది చిత్ర పరిశ్రమకు ఇబ్బందికరం అని భావించాం. అదే విషయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేట్టు చెప్పడానికి చాలా ప్రయత్నించాం.
వ్యక్తిగతంగా నేనూ ప్రయత్నించాను, ఇండస్ట్రీ మొత్తం ప్రయత్నించింది. కాకపోతే, ఎవరం కూడా ముందుకు వెళ్లలేకపోయాం. కానీ… ఒక వ్యక్తి వచ్చి, సీఎం జగన్ తో తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, రెండు మూడు సార్లు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి, మొత్తం పరిస్థితిని వివరించారు. ఆయన ప్రయత్నాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వడం. అలా సినిమా టికెట్ ధరలు పెంచేందుకు కారకుడైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారే. ఈ విషయంలో చిరంజీవిని చాలామంది అనేక రకాలుగా మాటలు అన్నారు.
మమ్మల్ని నెగ్గించడానికి… ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారు. చిరంజీవి గారూ… మీరు నిజంగా మెగాస్టార్ అని అన్నారు రాజమౌళి. ఇంకా చిరంజీవి గురించి చెప్పాలంటే… చాలామందికి తెలియని విషయం ఇంకోటుంది. కేసీఆర్ సర్కార్ నుంచి గతంలో వచ్చిన జీవోకి కూడా చిరంజీవి గారే కారణం. ఆయన తెరవెనుక ఉండి అంతా నడిపించారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం చిరంజీవి గారికి ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉండాలనుకుంటారు. నేను మాత్రం ఆయనను ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్దగానే భావిస్తాను. చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆయనకు రుణపడి ఉండాలి అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు రాజమౌళి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. అలానే మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శక ధీరుడు రాజమౌళి.
Related News
TS : ఎన్నికల వేళ యువతకు మెగాస్టార్ సందేశం
Telangana Lok Sabha elections: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన ఓటు హక్కును వినియోగించున్నారు. హైదరాబాద్ జూబ్లీక్లబ్లో చిరంజీవి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటును యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. We’re now on WhatsApp.