Road Accident : రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ నటి మృతి..!!
- Author : hashtagu
Date : 13-11-2022 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ మరాఠీ నటి కల్యాణీ కుర్లే జాదవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 32ఏళ్ల కల్యాణాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని కొల్హాపూర్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నటి ప్రయాణిస్తున్న బైక్ సిమెంట్ మిక్సర్ ట్రాక్టర్ ను డీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కల్యాణి కుర్లే జాదవ్ తుజ్యత్ జీవ్ రంగ్లా సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సాంగ్లీ కొల్హాపూర్ హైవేలోని హలోండి చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.