Star Maa : జూనియర్ షోలో కోటీశ్వరుడైన పోలీస్ అధికారి
`ఎవరు మీలో కోటిశ్వరుడు` గేమ్ షోలో తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయల నగదు గెలుచుకున్నాడు. దాంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంటెస్టెంట్గా ఆయన చరిత్ర సృష్టించాడు.
- By CS Rao Published Date - 12:12 PM, Mon - 15 November 21
`ఎవరు మీలో కోటిశ్వరుడు` గేమ్ షోలో తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయల నగదు గెలుచుకున్నాడు. దాంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంటెస్టెంట్గా ఆయన చరిత్ర సృష్టించాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్ర ఈ అద్భుతాన్ని చేశాడు. తెలుగు టెలివిజన్ ఛానెల్లో ప్రసారమయ్యే ఓ గేమ్ షోలో ఒక వ్యక్తి ఇంత భారీగా ప్రైజ్ మనీ గెలువడం ఇదే తొలిసారి.జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్నది. ఈ షోలో పాల్గొన్న ఎస్సై రాజారవీంద్ర ఏకంగా కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలిచి.. తెలుగు టీవీ గేమ్ షోలో భారీగా నగదు గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచాడు. సాధారణ పార్టిసిపెంట్స్, సెలెబ్రిటీ పార్టిసిపెంట్స్లో ఎవరు కూడా ఇంతవరకు ఇంత భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా గెలుచుకోలేదు.
Also Read : దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా
దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ గేమ్ షోలో ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. అయితే వారంతా వేలు, లక్షల్లో మాత్రమే నగదు బహుమతి గెలుచుకోగలిగారు. కానీ రాజారవీంద్ర ఒక్కడే కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని జెమినీ టీవీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, రాజారవీంద్ర పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూనే అనేక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాడు.
Also Read : పుష్ప టు కేజీఎఫ్.. టాప్ మోస్ట్ 5 విలన్స్ వీళ్లే!
పోలీస్ కాంపిటీషన్స్లో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించాడు. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ పతకం గెలువాలన్నది రాజారవీంద్ర కల. ఎవరు మీలో కోట్వీరుడు గేమ్ షోలో గెలిచిన ప్రైజ్ మనీని తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటానని ఆయన చెప్పాడు. రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళ వారాల్లో రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది
Related News
Jhanvi Kapoor: దేవరపై బిగ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఫోటోస్ వైరల్?
జాన్వీ కపూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె దివంగత హీరోయిన్ అలనాటి నటి శ్రీదేవి కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట దడక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు