Malavika Nair: ఆ జాతిరత్నంని ఉంచుకుంటా.. ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్?
హీరోయిన్ మాళవిక నాయర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ, నాని కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీక
- By Nakshatra Published Date - 05:50 PM, Fri - 5 May 23
హీరోయిన్ మాళవిక నాయర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ, నాని కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందం అభినయం నటనతో మెప్పించినప్పటికీ అవకాశాలను మాత్రం అందుకోవడంలో వెనుకబడిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు విజయం అందుకోలేకపోతోంది. ఇది ఇలా ఉంటే మాళవిక నాయర్ తాజాగా నటించిన చిత్రం మంచి శకునములే.
ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంతోష్ శోభన్,మాళవిక నాయర్ కలిసిన నటించారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చిన్న సీక్రెట్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమా కోసం జాతీయ రత్నం డైరెక్టర్ అనుదీప్ కూడా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మాళవిక నాయర్ అనుదీప్ మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఇద్దరు మెట్లు దిగుతుండగా మాళవిక అనుదీప్ నీకో విషయం చెప్పాలి. ఏమీ అనుకోవద్దు మరి అని అనగా.. చెప్పండి అని అనడంతో నిన్ను ఉంచుకుంటా అబ్బాయ్ అంటూ షాక్ ఇచ్చింది మాళవిక నాయర్. ఆ మాటకు అనుదీప్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని సిగ్గు పడుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని షేర్ చేస్తూ అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది అనే క్యాప్షన్ కూడా జోడించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది