Liger Promotion: పాట్నాలో ప్రమోషన్.. చాయ్ వాలాగా విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ ఈ నెలలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది.
- By Balu J Published Date - 03:20 PM, Sat - 6 August 22
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ ఈ నెలలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఎప్పుడైతే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందో, ఆరోజు నుంచే విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టాడు. తన మూవీ ప్రమోషన్ కు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. ఇప్పటికే ముంబై లోకల్ ట్రైన్స్, మాల్స్ లో సందడి చేసిన విజయ్ తాజాగా పాట్నాలో ప్రత్యక్షమయ్యాడు. పాట్నాలోని ప్రముఖ టీ స్టాల్లో అభిమానులతో కలిసి చాయ్ను ఎంజాయ్ చేసి, ఫొటోలకు పోజులిచ్చాడు.
టూర్లో భాగంగా విజయ్ దేవరకొండ పాట్నా లేన్స్లో ఉన్న ప్రముఖ టీ స్టాల్ గ్రాడ్యుయేట్ చైవాలీని సందర్శించారు. అభిమానులతో టీ తాగి, వారితో కలిసి ఫోటోలు దిగారు. విజయ్ దేవరకొండ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సాధారణంగా కనిపించి, అభిమానులతో సందడి చేశాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లైగర్ ఆగస్టు 25న థియేటర్లలోకి రానుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా లైగర్ ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ విడుదలైన మూడో సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Related News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..