Jio Cinema : జియో సినిమా యూజర్స్కి.. అంబానీ మామ బంపర్ ఆఫర్..
జియో సినిమా యూజర్స్కి అంబానీ మామ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేవలం రూ.29కి..
- By News Desk Published Date - 10:52 AM, Thu - 25 April 24
Jio Cinema : ముకేశ్ అంబానీ ‘జియో సినిమా ఓటీటీని స్టార్ట్ చేసి.. ఐపీఎల్ తో పాటు కొన్ని సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం జియో సినిమాస్ యూజర్స్ అంతా ఈ ఆఫర్ ని యాడ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అవును ఫ్రీగా సినిమాలు చూసే యూజర్స్ కి యాడ్స్ ఎక్కువుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ యాడ్స్ ని తొలిగించి కంటిన్యూగా సినిమాలు చూసేలా అంబానీ మామ అవకాశం కల్పిస్తూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.
ఇందుకోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఆఫర్ ని యూజర్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ ఆఫర్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే.. నెలకి రూ.29 చెల్లించి యాడ్స్ లేకుండా సినిమాలు మరియు మిగతా కంటెంట్ ని చూడొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక డివైస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ వల్ల ఒకే సమయంలో ఒక డివైస్ లోనే చూడగలము. ఇక రెండో ఆప్షన్లో.. నాలుగు డివైస్ లు కలిసి ఒకే సమయంలో చూసేలా అవకాశం కలిపిస్తూ ఆఫర్ ఇచ్చారు.
ఈ ఆఫర్ కోసం నెలకి రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 89 చెల్లించి నాలుగు డివైస్ లు ఒకే సమయంలో యాడ్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు. అదికూడా 4K క్వాలిటీతో చూసేయొచ్చు. మరి అంబానీ మామ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ని మీరు కూడా ఉపయోగించేసుకోండి. కాగా రానున్న రోజుల్లో జియో నుంచి సూపర్ కంటెంట్ ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం క్రేజీ సినిమా అండ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ అన్ని మేకింగ్ లో ఉన్నాయి.
Just In :
JioCinema announces Gamechanging Premium plans with Ad-free 4K streaming & offline viewing starting only ₹29/month which enables access to HBO/Paramount+/Peacock INTL Content.
Sports & Indian entertainment content will remain free with ads, even without subscription! pic.twitter.com/huicpWTFhU
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 25, 2024
Also read : Rajinikanth : ‘కూలీ’ సినిమాకి రజినీకాంత్ అన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..?
Related News
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.