సామ్ బిజీ బిజీ.. ఆహాలో మరోసారి!
టాలీవుడ్ బ్యూటిఫూల్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా సొంత మార్గాల్లో పయనించాలని నిర్ణయం తీసుకున్నారు.
- By Balu J Published Date - 08:30 AM, Wed - 20 October 21
టాలీవుడ్ బ్యూటిఫూల్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా సొంత మార్గాల్లో పయనించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించినట్టుగానే భార్యాభర్తలుగా విడిపోయిన చైతన్య, సమంత బిజీబిజీగా మారారు. లవ్ స్టోరీ సక్సెస్ చైతూ కొత్త సినిమా కథలు వింటూ బిజీగా ఉంటే, సమంత కూడా ఇతర సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే ‘సామ్ జామ్’ పేరుతో ఆహాలో సమంత అలరించిన విషయం తెలిసిందే. నాగచైతన్య నుంచి చిరంజీవి దాకా ఎంతోమంది స్టార్స్ ఆహాలో అలరించారు. తాజాగా మరోసారి సమంత హోస్ట్ గా ఆహాలో కనిపించనుంది.
ఈ మేరకు ఓటీటీ నిర్వాహకులు సమంతతో చర్చలు జరిపినట్టు, సమంత కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి తన క్యూట్ ఇంటర్వ్యూస్ తో సమంత ఆకట్టుకోనుంది. ఆహాతో పాటు ఇతర సినిమాలను కూడా సమంత ఒప్పుకుంది. శాంతరుబన్ దర్శకత్వంలో ఒక ప్రేమ కథ మూవీ, హరి, హరీష్ తీయబోయే మరో సినిమాకు ఆమె సంతకం చేసింది. గుణశేఖర్ పౌరాణిక మూవీ ‘శకుంతలం’ మూవీ దాదాపుగా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం ఓకే చెప్తున్న సినిమాలకు కొత్త షరతులు పెడుతుందట సమంత. షరతులకు ఓకే చేసిన సినిమాలకు మాత్రమే సైన్ చేస్తుందని టాక్. అటు సమంత పెట్టే షరతులు మరీ అంత ఇబ్బందికరంగా లేకపోవటం వలన దర్శకులు కూడా సరే అంటున్నారు. నిజానికి ఆ షరతులు ఏంటంటే.. సినిమా షూటింగ్ చెన్నై ప్రాంతంలో ఉండాలని, ఒకవేళ హైదరాబద్ లో షూటింగ్ ఉంటే మాత్రం.. ఇండోర్ లో మాత్రమే ఉండాలని చెప్తుందట.
Related News
LS Polls: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ నటి.. చేవేళ్ల బరిలో పోటీ!
LS Polls: నిస్సందేహంగా ఎన్నికల సీజన్ టాలీవుడ్ పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తెలుగు నటులు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుగు యువ నటి సాహితి దాసరికి సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగులో పుట్టిన ఈ భామ ‘పొలిమెరా’, ‘మా ఊరి పొలిమెర 2’ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురు చూడడమే కాకుండా రాజకీ�