Gopichand: ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపిచంద్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా, ఎప్పుడంటే
- By Balu J Published Date - 06:58 PM, Sat - 13 April 24
Gopichand: గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు.
భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది భీమా. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ భీమా సినిమాకు మంచి రెస్పాన్స్ రాబోతోంది.
Related News
Sreeleela: కోలీవుడ్ స్టార్ కు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకో తెలుసా
Sreeleela: కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అందాల తార శ్రీలీల తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న ‘ఓటీటీ’లో ఐటెం సాంగ్ చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. ఓ పాటతో తమిళ చిత్రసీమలో తన కెరీర్ ను ప్రారంభించడం ఆమెకు ఇష్టం లేదని, కోలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఓటీటీ’ చిత్ర నిర్మాతల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని చెన్నై వర్గాలు త�