Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్
- By Balu J Published Date - 11:35 PM, Mon - 8 January 24
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తోంది. అయితే అయితే తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుక సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 09న గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్, భరత్ పెట్రోల్ బంక్ పక్కన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ గుంటూరు పయనమవుతున్నారు.
శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా.. యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో భారీ ఎత్తున్న ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ఈ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
అయితే గుంటూరు కారం సినిమాకు సంబంధించి మొదటి నుంచి త్రివిక్రమ్ టచ్ కనిపించకపోవడం గమనార్హం. ఇది సగటు మా సినిమాలా కనిపిస్తోంది తప్ప త్రివిక్రమ్ ప్రత్యేకత లేదని ఆయన ఫ్యాన్స్ ముందు నుంచి కొంత ఫీలవుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా ఆయన ముద్ర తక్కువనే చెప్పాలి. త్రివిక్రమ్ గత సినిమాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే.. గుంటూరు కారం ఆయన సినిమాయేనా అనిపించేలా ఉంది ట్రైలర్. ఇందులో హీరో క్యారక్టర్, యాక్షన్ ఎక్కువగా హైలెట్ అయ్యాయి. అయితే ట్రైలర్ చూస్తే పైసా వసూల్ అని మాత్రం అనిపించింది.
అయితే ట్రైలర్లో త్రివిక్రమ్ మార్కు లేదని మహేష్ ఫాన్స్ పెద్దగా ఏమి ఫీల్ అవ్వట్లేదు. నిజానికి ఈ విషయాన్ని సానుకూలంగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మహేష్ తో త్రివిక్రమ్ తీసిన రెండు చిత్రాలు అతడు, ఖలేజాల్లో స్పష్టంగా ఆయన ముద్ర కనిపిస్తుంది. త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు అనడానికి ఆ రెండు చిత్రాలు నిదర్శనం. వాటిలో కామెడీ, డైలాగ్స్ మామూలుగా పేలలేదు. కానీ ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. కానీ గుంటూరు కారం మూవీ మొదట్నుంచీ భారీ అంచనాలు రేపుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్టు సమాచారం.
Related News
Mahesh Babu : మహేష్ బాబు వల్ల నా అహం దెబ్బతింది.. సీనియర్ యాక్టర్ రంగనాథ్..
మహేష్ బాబు వల్ల నా అహం దెబ్బతింది అంటూ సీనియర్ యాక్టర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. నిజం సినిమాలో నటిస్తున్నప్పుడు..