HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Offers Condolences Rajendraprasad S Daughter Gayatri

Rajendra Prasad : రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన చిరంజీవి

Rajendra Prasad : గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

  • Author : Sudheer Date : 05-10-2024 - 5:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru Rajendra
Chiru Rajendra

టాలీవుడ్​ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె గాయత్రి (38) (Rajendra Prasad Daughter Gayathri) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలిసి రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.

తాజాగా నటులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , అల్లు అర్జున్ (Allu Arjun) , వెంక‌టేశ్‌ (Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి తో పాటు పలువురు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించి..వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా రాజేంద్ర‌ప్రసాద్‌ని క‌లిసి ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదిక‌గా స్పందిస్తూ.. నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ రాసుకోచ్చాడు.

నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్ర ప్రసాద్​, మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కామెడీ హీరోగా మెప్పించారు. ఎన్నో సూపర్​ హిట్​ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా రాణిస్తున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. గతంలో బేవార్స్ అనే సినిమా ఈవెంట్‌లో తన కుమార్తె గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ‘తల్లి తల్లి నా చిట్టి తల్లి’ అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆ సాంగ్​ను గాయత్రికి ఎన్నో సార్లు వినిపించినట్లు తెలిపారు. అప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

చిరంజీవిని పట్టుకొని ఎక్కెక్కి ఏడ్చిన రాజేంద్ర ప్రసాద్! #RajendraPrasad #gayatridevi #HashtagU pic.twitter.com/SQGbgOix8l

— Hashtag U (@HashtaguIn) October 5, 2024

నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె పార్థివ దేహానికి నివాళులర్పించిన హీరో#AlluArjun𓃵 #RajendraPrasad #gayatridevi #HashtagU @alluarjun pic.twitter.com/m2JlB8BaoF

— Hashtag U (@HashtaguIn) October 5, 2024

అనిల్ రావిపూడితో రాజేంద్రప్రసాద్.. తన కూతురు గురించి చెప్తూ.. #AnilRavipudi #RajendraPrasad #gayatridevi #HashtagU pic.twitter.com/09n7LkK8mq

— Hashtag U (@HashtaguIn) October 5, 2024

గాయత్రీ ప్రసాద్ మృతితో రాజేంద్ర ప్రసాద్ ను ఓదారుస్తున్న హీరో విక్టరీ వెంకటేష్. #RajendraPrasad #Venkatesh #Tollywood #HashtagU pic.twitter.com/SWvgL57QKB

— Hashtag U (@HashtaguIn) October 5, 2024

Read Also : Canada : వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు అంత కష్టపడాలా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Rajendra Prasad
  • rajendra prasad daughter gayathri
  • rajendra prasad daughter gayathri dies
  • rajendra prasad daughter rajendra prasad gayathri

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd