Prathinidhi 2 : ప్రతినిధి 2 సినిమా చూసి.. ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు..
ప్రతినిధి 2 సినిమా చూసి ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు. ఓటు అనేది పెట్టుబడి లాంటిది..
- By News Desk Published Date - 10:51 AM, Thu - 9 May 24
Prathinidhi 2 : నారా రోహిత్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ప్రతినిధి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ప్రతినిధి 1 సినిమా.. నారా రోహిత్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించి ఎన్నికల సమయంలో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.
తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ని దర్శకుడు మూర్తి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి చూపించారు. ట్రైలర్ ని చూసిన చంద్రబాబు మాట్లాడుతూ.. “ఓటు అనేది పెట్టుబడి లాంటిది. దానిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఈ 13వ తారీఖున ఆ ఓటుని ఆలోచించి జాగ్రత్త ఉపయోగించుకోండి. అంతకముందు ప్రతినిధి 2 సినిమా కూడా చూసేయండి” అంటూ చెప్పుకొచ్చారు.
మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే… మీ జీవితాన్నే మార్చేస్తుంది! ☝🏻✊🏻
President of @JaiTDP Party ~ Sri @ncbn garu urges everyone to VOTE, Because voting is your RIGHT. Also shared his best wishes to the whole team of #Prathinidhi2 ✨ pic.twitter.com/WCa5XWTb4t
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 9, 2024
ప్రతినిధి 1 మంచి హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను మూవీ టీం అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లోనే కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
మరి ఎన్నికలకు మూడు రోజుల ముందు వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగరం సంగీతం అందిస్తున్నారు.
Related News
Chandrababu Naidu: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం.. పోలింగ్ పై చంద్రబాబు రియాక్షన్
Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు అంటూ ఏపీ పోలింగ్ పై రియాక్ట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్�