Mahesh babu: 150 కోట్ల బడ్జెట్ దాటేసిన గుంటూరు కారం, మహేశ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 04:12 PM, Sat - 9 September 23
Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం బడ్జెట్ 150 కోట్ల బడ్జెట్ను దాటింది. ఇది నటుడి కెరీర్లోనే అత్యధికం. “దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనూ రాజీపడకూడదనుకోవడం వల్ల మొదట అనుకున్న బడ్జెట్ను మించిపోయింది” అని తెలుస్తోంది. అగ్ర నిర్మాత రాధాకృష్ణ కూడా ఈ ప్రాజెక్ట్ పై నమ్మకంతో భారీగా డబ్బులు పెడుతున్నారు.
పూజా హెగ్డేని శ్రీలీలతో భర్తీ చేయడం వల్ల కొన్ని రీషూట్లు జరిగాయి. ఇప్పటికే అందమైన ప్రాంతాల్లో పాటలు షూట్ అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు, సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరితో కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఇది పూర్తి వినోదాత్మక రీతిలో సాగనుంది. మహేష్-త్రివిక్రమ్ కాంబో అతడు మూవీ భారీ విజయం నమోదు చేసింది. అయితే ఖలేజా మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, సక్సెస్ కాలేకపోయింది.
గుంటూరు కారం మూవీ వరుసగా వాయిదా పడుతున్న పలువురు ఈ మూవీ నుంచి తప్పుకున్నా త్రివిక్రమ్ ఏమాత్రం అధైర్యపడలేదు. మహేశ్ కు బ్లాక్ బ్లస్టర్ మూవీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. గుంటూరు కారం వచ్చే జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ దాదాపు 250 కోట్లతో తెరకెక్కుతుందని వార్తలు వినిపించాయి. ఒకవేళ ఇదే నిజమైతే మహేశ్ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ మూవీ అవుతుంది. ఇటీవల రోజుల్లో తెలుగు సినిమా బడ్జెట్లు పరిమితులు దాటిపోతున్న విషయం తెలిసిందే.
Also Read: Transgender: తెలంగాణ ఎన్నికల సంఘం ఐకాన్ గా ట్రాన్స్ జెండర్, ఓటుహక్కుపై లైలా క్యాంపెయిన్!
Related News
Krishna : ‘సాయిబాబా’గా కృష్ణ ఓ మూవీ చేసారా..? మహేష్ చేతుల మీదుగా ఓపెనింగ్..
'సాయిబాబా'గా కృష్ణ ఓ మూవీ చేసారని మీకు తెలుసు. ఆ మూవీ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయ్యింది.