Bandla Ganesh: పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేశ్ సెటైర్లు!
పూరీ జగన్నాథ్ గురించి బండ్ల గణేష్కి బాగా తెలుసు. ఆయనతో సుదీర్ఘ బంధం ఉంది.
- By Balu J Published Date - 02:53 PM, Thu - 23 June 22
పూరీ జగన్నాథ్ గురించి బండ్ల గణేష్కి బాగా తెలుసు. ఆయనతో సుదీర్ఘ బంధం ఉంది. గతంలో పూరీ జగన్నాథ్కి ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. ఆయనతో సినిమాలు నిర్మించారు. సమయం దొరికినప్పుడల్లా పూరీపై ప్రేమను కురిపించే బండ్ల గణేశ్ అనూహ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పూరీ జగన్నాథ్పై సెటైర్స్తో విరుచుకుపడ్డాడు. బండ్ల గణేష్ ఫైర్బ్రాండ్ స్పీచ్లతో పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. బండ్ల తన ప్రసంగంలో పూరీ జగన్నాథ్ భార్య లావణ్యను సీత, కుంతితో పోల్చారు. ఆమె సహనానికి ప్రతిరూపమని ఆయన అన్నారు.
అయితే ఏ కారణం చేత ఓపిక పట్టిందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. లావణ్య తన జేబులో ఏమీ లేనప్పుడు పూరీ జగన్నాథ్ను వివాహం చేసుకున్నాడని, అయితే స్టార్ డైరెక్టర్ గా నిలదొక్కుకున్నాకా ఆయన చుట్టూ చాలామంది చేరారని (ర్యాంప్, వ్యాంప్) అన్నారు. అయితే తాను ప్రస్తావిస్తున్న వ్యాంప్ ఎవరనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పూరీ జగన్నాథ్ కొంతమంది హీరోలకు డైలాగ్ డెలివరీ, మరికొందరికి డ్యాన్స్ మూవ్మెంట్స్ నేర్పించి స్టార్స్గా మార్చారని, అయితే ఆకాష్ పూరిని విష్ చేయడానికి ఎవరూ రాలేదని సెటైర్లు వేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ‘చోర్ బజార్’ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Related News
Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద�