Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ ..జైలు లో వేసే ఛాన్స్ ఉందా..?
Allu arjun arrest : కేసు రుజువైతే ఆయనకు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసు తీవ్రత, సంబంధిత సెక్షన్ల ప్రకారం శిక్ష కఠినంగా ఉండవచ్చని వారు అంటున్నారు.
- Author : Sudheer
Date : 13-12-2024 - 1:22 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్ప మూవీ లో ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయ్యి..జైల్లో ఉన్న అల్లు అర్జున్..ఇప్పుడు నిజ జీవితంలో జైల్లో ఉండే పరిస్థితి వచ్చిందా..? అంటే అవుననే చెప్పాలి. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు మృతువుతో పోరాడుతున్నాడు. ఈమె మరణానికి కారణం..అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమే.
పుష్ప మూవీ తో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ కి పెరిగిందో తెలియంది కాదు..రెండేళ్లు గా పుష్ప 2 కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా హైప్ ను మరింత పెంచేలా దేవి సాంగ్స్ ఇవ్వడం..అదే రీతిలో మేకర్స్ ప్రమోషన్ చేయడంతో సినిమాను చూడాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ ఆసక్తి తగ్గట్లే సినిమాను పాన్ ఇండియా గా భారీ ఎత్తున అనేక భాషల్లో విడుదల చేసారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ థియేటర్స్ లలో రిలీజ్ చేయడం తో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్స్ ధరలు పెంచారు.
కాగా డిసెంబర్ 04 న సంధ్య థియేటర్ ( Sandhya Theatre) లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. అయితే ఈ ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ వస్తారని ముందే ప్రకటించే సరికి అల్లు అర్జున్ చూడాలని చెప్పి వేలాదిమంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారిలో రేవంతి అనే మహిళ కూడా ఒకరు. తన కుమారుడికి అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం కావడంతో ప్రీమియర్ షో చూసేందుకు కుమారున్ని తీసుకోని సంధ్య థియేటర్ కు వచ్చింది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ రావడం తో అతడ్ని చూసేందుకు పోటీపడింది. ఈ క్రమంలో భారీగా వచ్చిన అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సమయంలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ఫై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తన భార్య చావుకు కారణం వీరే అని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు థియేటర్ యజమాని తో పాటు మేనేజర్ ను అరెస్ట్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. కాసేపట్లో ఆయన్ను కోర్ట్ లో హాజరు పరచనున్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్లు 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS చట్టాల కింద అభియోగాలు మోపారు. కేసు రుజువైతే ఆయనకు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసు తీవ్రత, సంబంధిత సెక్షన్ల ప్రకారం శిక్ష కఠినంగా ఉండవచ్చని వారు అంటున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వార్త ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. చిక్కడపల్లి పోలీసుస్టేషన్లో అల్లు అర్జున్ ఉన్నాడని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు సైతం భారీ భద్రతను ఏర్పాటు చేసారు.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ .. #AlluArjun #sandhya70mm #sandhyatheatre #sandhya35mm #Pushpa2TheRule #HashtagU pic.twitter.com/E4AE9OfaUH
— Hashtag U (@HashtaguIn) December 13, 2024
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ .. #AlluArjun #sandhya70mm #sandhyatheatre #sandhya35mm #Pushpa2TheRule #HashtagU pic.twitter.com/E4AE9OfaUH
— Hashtag U (@HashtaguIn) December 13, 2024
Read Also : Weather Updates : ములుగులో చలి పులి.. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు