IME Rapid: బడ్జెట్ ధరలో అదరహో అనిపిస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్ తో 300 కి. మీ ప్రయాణం?
ప్రస్తుత రోజులో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రోజురోజుకీ
- By Nakshatra Published Date - 05:00 PM, Sun - 10 September 23
ప్రస్తుత రోజులో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రోజురోజుకీ వీటికి ఉన్న డిమాండ్ పెరిగిపోతుండడంతో ఆయా కంపెనీలు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది ఈవీ. ఇందులో ఫీచర్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. మల్టీ బ్రాండ్ ఇ-మొబిలిటీ రిటైల్ స్పేస్. మై ఈవీ స్టోర్ తాజాగా ఈ కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ టూవీలర్ను తీసుకువచ్చింది. దీని పేరు ఐఎంఈ ర్యాపిడ్. ఈ స్కూటర్ మూడు వేరియంట్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వేరియంట్ ఆధారంగా రేంజ్ మారుతుంది. 100 కిమి, 200 కి.మి. 300 కి.మి చొప్పున రేంజ్ కలిగి ఉంటాయి. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా టాప్ స్పీడ్ కూడా గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది.కాగా ఐఎంఈ ర్యాపిట్ ధర రూ. 99 వేల నుంచి ప్రారంభం అవుతోంది.
గరిష్టంగా రూ. 1.48 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2000 వాట్ మోటార్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 60వీ- 26/ 52/ 72 ఏహెచ్. అంతేకాకుండా మై ఈవీ స్టోర్ పలు ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్కూటర్ కొనేందుకు సులభంగా లోన్ కూడా పొందొచ్చు. కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదట బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తర్వాత నెమ్మదిగా స్కూటర్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Related News
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.