Mahindra Xuv.E9 Price: ఒక్క ఛార్జ్ తో 450 కి.మీ మైలేజీని ఇస్తూ అదరగొడుతున్న మహీంద్రా కార్.. మరిన్ని ఫీచర్స్ ఇవే!
అద్భుతమైన మైలేజ్, అదిరిపోయే ఫీచర్స్ తో మహీంద్రా XUV.e9 కార్ మార్కెట్లోకి త్వరలోనే విడుదల కానుంది.
- Author : Anshu
Date : 31-07-2024 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఇప్పటికే మార్కెట్ లోకి చాలా రకాల కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన కార్లతో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మహీంద్రా కంపెనీ XUV.e9 కారును ఏప్రిల్ 2025 నాటికి మార్కెట్లో లాంచ్ చేయనుందట. అయితే ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రానుందట. దీంతో పాటు పెద్ద బూట్ స్పేస్ ను కలిగి ఉంటుందట. ఈ మహీంద్రా కారుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా ఇటీవల లీక్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ లీక్ అయిన ఫోటోస్ చూస్తే ఇది ప్రీమియం సీటింగ్ లేఅవుట్ తో రావడమే కాకుండా కార్గో స్పేస్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మహీంద్రా కంపెనీ ఈ XUV.e9 కారును INGLO ప్లాట్ఫారమ్పై రూపొందించిన్నట్లు ఆ ఫోటోస్ ని చూస్తే తెలుస్తోంది. అందుకే ఇందులో పెద్ద బూట్ స్పేస్తో పాటు రెండు వరస సీట్లు కూడా అందించారు. దీంతో ఈ కారులో మొత్తం 5 సీట్లు ఉంటాయట. అంతేకాకుండా ఈ కారులో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో రిక్లైనింగ్ ఫంక్షన్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. దీని ద్వారా బూట్ స్పేస్ మరింత పెరుగుతుంది. ఈ కారు క్యాబిన్లోని సీట్లు లైట్ రంగులతో పాటు లెదర్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆటోమేటిక్ గేర్ లివర్ ను కూడా అందిస్తున్నట్లు సమాచారం అలాగే ఈ కారులో 2-కప్ హోల్డర్లతో పాటు ఆటో-హోల్డ్ ఫంక్షన్ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2-స్పోక్ స్టీరింగ్ వీల్తో పాటు పెద్ద స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో ఈ XUV.e9 కారు అందుబాటులోకి రానుంది. ఇక ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు దాదాపు 435 నుంచి 450 కిమీల వరకు మైలేజీని అందిస్తుంది. ఇక ఇది ధర రూ.38 లక్షల ఎక్స్ షోరూమ్ ఉంటుంది.