HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Closes In Jagans Own District

Kadapa : జగన్ సొంత జిల్లాలో వైసీపీ క్లోజ్ ..?

Kadapa : 1999 తర్వాత తొలిసారిగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం వల్ల వైసీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో పడిపోయింది

  • Author : Sudheer Date : 17-02-2025 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Marks Justice
Jagan Marks Justice

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం(Mydukur Assembly Constituency)లో వైసీపీ (YCP) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2024 సాధారణ ఎన్నికల అనంతరం కూటమి పార్టీ అధికారం చేపట్టడంతో దీర్ఘకాలంగా వైసీపీ హస్తగతంలో ఉన్న మైదుకూరు నియోజకవర్గం చేజారిపోయింది. 1999 తర్వాత తొలిసారిగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం వల్ల వైసీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో పడిపోయింది. ముఖ్యంగా వైసీపీకి విశ్వాసంగా ఉన్న కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి (Settipalli Raghurami Reddy) నిర్లక్ష్య వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరులో 1985 నుంచి వరుసగా తొమ్మిది సార్లు పోటీ చేసిన రఘురామిరెడ్డి, నాలుగు సార్లు మాత్రమే విజయం సాధించగా, 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడంతో, క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఎన్నికల ముందు కార్యకర్తలతో అనేక హామీలు ఇచ్చినా, ఓటమి తర్వాత వారిని పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం
అధికారంలో ఉన్న సమయంలో తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, సాధారణ కార్యకర్తలను దూరంగా ఉంచిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అసలు కనపడకపోవడం క్యాడర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. జగన్ క్యాడర్‌కు భరోసా ఇచ్చేలా, రెండోసారి అధికారంలోకి వస్తే, పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నప్పటికీ. ఆయన సొంత జిల్లాలోనే క్యాడర్ సమస్యలు ఎదుర్కొంటున్నా, పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. మైదుకూరు నియోజకవర్గం కాకుండా, కడప జిల్లాలోనే వైసీపీ ఓటమి చెందిన ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతుండడంతో, టీడీపీ నాయకత్వం గట్టిపట్టు సాధిస్తోంది. టీడీపీ విజయం సాధించిన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఇప్పటికే పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నా, టీడీపీ నేతలు వారిని వెంటనే పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ క్యాడర్ టీడీపీ కార్యకర్తలపై అనేక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. త్వరలోనే వారు కూడా శాంతిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి జగన్ సొంత జిల్లాలో వైసీపీ క్లోజ్ కాబోతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తుండడం తో మిగతా జిల్లాలోని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Elections
  • jagan
  • Mydukur Assembly Constituency
  • Settipalli Raghurami Reddy
  • tdp
  • ycp close

Related News

Pemmasani Vs Ambati

Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

  • Unnam Hanumantharaya Chowdh

    Kalyandurgam : TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd