YSRCP : పలాసలో మంత్రి అప్పలరాజుకు షాక్.. కొత్త అభ్యర్థి బరిలోకి యోచనలో వైసీపీ అధిష్టానం
వచ్చే ఎన్నికల్లో చాలా మంది కొత్తవారిని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపుతుంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో బలమైన నేతలుగా,
- By Prasad Published Date - 08:56 AM, Wed - 7 February 24
వచ్చే ఎన్నికల్లో చాలా మంది కొత్తవారిని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపుతుంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో బలమైన నేతలుగా, ప్రజాధారణ ఉన్న వారికి ఈ సారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే చాలామంది కొత్తవారిని ఇంఛార్జ్లుగా నియమించింది. ఇటు శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా మంత్రి సిదిరి అప్పలరాజును తప్పించాలని వైసీపీ అధిష్టానం భావించింది. గ్రూపు తగాదాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పల రాజును మార్చి పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని వైఎస్సార్సీపీ హైకమాండ్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా మౌనం పాటిస్తున్నారు. పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు దుప్పల వెంకట రవికిరణ్కు అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అప్పల రాజు మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా, రవికిరణ్ కళింగ సామాజికవర్గానికి చెందినవారు. పలాస నియోజకవర్గంలో కళింగ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రవికిరణ్ జాతీయ ఆరోగ్య మిషన్లో రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఉన్నత స్థాయి అధికారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన దువ్వాడ శ్రీధర్, దువ్వాడ హేమబాబు తదితర నాయకులు అప్పల రాజును వ్యతిరేకిస్తున్నారు. గతంలో అప్పలరాజును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వరుస సమావేశాలు నిర్వహించారు. పలాసలో జీడిమామిడి రైతుల సమస్యను పరిష్కరించడంలో మంత్రి విఫలమయ్యారని, పలాస మండలం పరిసర ప్రాంతాల్లో భూమాఫియా కార్యకలాపాలకు మద్దతుగా నిలిచి ప్రతిష్టను పోగొట్టుకున్నారని ఆరోపించారు. దీంతో అప్పలరాజుపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయన్ని మార్చాలని వైసీపీ భావిస్తుంది. మళ్లీ అప్పలరాజుకే టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోతుందని సర్వేల్లో కూడా తెలిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమైంది. మరి టికెట్ దక్కకపోతే మంత్రి అప్పలరాజు పార్టీలో కొనసాగుతారో లేదో వేచి చూడాలి.
Also Read: AP TDP: విజయ నగరం జిల్లాపై చంద్రబాబు గురి, ఆశావహుల్లో గుబులు
Related News
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.