AP Husbands Harassment: వామ్మో…సైకో భర్తలకు కేరాఫ్ అడ్రెస్ ఏపీ అట..!!
భరించేవాడే భర్త. బాధ పెట్టేవాడు కూడా భర్తే..ఏది ఏమైనా భార్యాభర్తల అనుబంధం...పాలునీళ్లలా ఉండాలని పెద్దలు అంటుంటారు.
- By Hashtag U Published Date - 06:00 AM, Fri - 27 May 22
భరించేవాడే భర్త. బాధ పెట్టేవాడు కూడా భర్తే..ఏది ఏమైనా భార్యాభర్తల అనుబంధం…పాలునీళ్లలా ఉండాలని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుతకాలంలో భర్తలు సైకోలుగా…మారి భార్యలను హింసిస్తున్నారు. ఇలాంటి సైకో భర్తలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నారట. ఈ విషయాన్ని కేంద్రం సర్వే చేసి మరి చెప్పింది. ఏపీలోనే సైకో భర్తలు ఎక్కువగా ఉన్నారని…జాతీయ కుటుంబం, ఆరోగ్య సర్వేలో తేలింది. ఏపీలో 18-94 ఏళ్ల వయస్సున్న పెళ్లయిన మహిళల్లో 35శాతం మంది శారీరక లైదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. అందులోనూ ఆ హింసను తట్టుకుని జీవిస్తున్న మహిళలు కొంతమంది కాగా…భర్తల వేధింపులు తట్టుకోలేని మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారట.
4శాతం మంది తమ భర్త చేసిన లైంగిక హింసను తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తున్నారట. 15శాతం మంది మానసికంగా హింసను ఎదుర్కొంటుండగా…27శాతం వివాహిత మహిళలు తమ భర్తలచే దెబ్బలు తిన్నవారున్నారని వెల్లడైంది. 11శాతం మంది తమపైకి నెట్టబడటం లేదా విసిరికొట్టడం, తన్నడం, లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. 8శాతం మంి తమ చేతిని మెలితిప్పి, పిడికిలితో లేదా వారికి హానికలిగించే విధంగా కొట్టడం వంటివి ఎదుర్కొన్నారు.
NHFSప్రకారం మహిళలు తమ భర్త తాగిన సమయంలో ఎక్కువగా హింసకు గురవుతున్నారని సర్వేలో తేలింది. భార్యలను హింసించేటప్పుడు అది మానసికంగా లేదా శారీరకంగా అయిన ఆ సయమంలో దాదాపు 76శాతం మంది భర్తలు తరచుగా తాగి ఉంటారని మహిళలు తెలిపారు. మొత్తంమీద NHFSసర్వే ప్రకారం రాష్ట్రంలో తాగిన సమయంలో మహిళలపై హింస జరుగుతుందని తేలింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇఫ్పుడు ఈ సర్వే చెప్పిన షాకింగ్ నిజాలు…రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.