HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Mp Kesineni Nani Meeting With District Officials

Vijayawada : 2024 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం – ఎంపీ కేశినేని నాని

2024 చివరి నాటికి జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని విజయవాడ

  • By Prasad Published Date - 07:35 AM, Sun - 27 August 23
  • daily-hunt
MP Kesineni Nani
MP Kesineni Nani

2024 చివరి నాటికి జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని విజయవాడ ఎంపీ, ఎన్టీఆర్‌ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌ కేసినేని శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.67 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చామని, 2024 నాటికి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది 1.04 లక్షల కుళాయి కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో కేశినేని నాని అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాయన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారి కేసుల నేపథ్యంలో కృష్ణా నీటి సరఫరా కోసం ఎ.కొండూరు మండలానికి కేంద్ర ప్రభుత్వం రూ.49.92 కోట్లు మంజూరు చేసిందన్నారు.

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, అవరోధాలను అధిగమించడమే ఈ స‌మావేశం లక్ష్యమని కేశినేని నాని తెలిపారు. పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు చేస్తున్న సేవలను కొనియాడారు. 300 గ్రామ పంచాయతీలకు నీటి కొరత ఏర్పడినప్పుడు కలెక్టర్ నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేశారని గుర్తు చేశారు. కొండపల్లి బొమ్మల గురించి ప్రస్తావిస్తూ.. 63 మంది కళాకారులకు రూ.10 వేల విలువైన టూల్ కిట్‌లను అందజేశామని, బొమ్మలకు గుర్తింపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ భవనాలు, గ్రామ/వార్డు సచివాలయ కార్యాలయాలు ప్రాధాన్యతా ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. కిడ్నీ సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న ఎ కొండూరు మండలం గిరిజన తాండాలకు తాగునీటి సరఫరా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 83,485 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని నాని తెలిపారు.

ఆగస్టు 30 నాటికి 15,127 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని కేశినేని నాని తెలిపారు. జాతీయ రహదారులు, ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్‌, ఆర్‌ అండ్‌ బి, నీటిపారుదల, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల పనుల పురోగతిని ఎంపీ సమీక్షించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రాయోజితం చేస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్చలు జరుపుతామన్నారు. సమావేశంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ ఆర్.భాగ్యలక్ష్మి, కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DISHA
  • MP Kesineni nani
  • NTR district Collector
  • TDP MP kesineni nani
  • vijayawada

Related News

    Latest News

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

    • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

    • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd