HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vastu Changes In Jagan Tadepalli House

Jagan Tadepalli House : ఇంటి వాస్తు.. జగన్‌ లో ఓటమి భయం పుట్టించిందా..?

తాడేపల్లి ప్యాలెస్‌ లో వాస్తు దోషం అని చాలామంది చెప్పడం తో.. జగన్ వాస్తు నిఫుణులను రప్పించి దోషాలను పరిష్కరించే పనిలో పడ్డారని అంటున్నారు

  • Author : Sudheer Date : 04-05-2024 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Tadepalli House
Jagan Tadepalli House

175 కు 175 కొట్టేస్తున్నాం.. సింహం సింగిల్ గా వస్తాది.. మరోసారి రాష్ట్ర ప్రజలు వైసీపీ (YCP) ని భారీ మెజార్టీ తో గెలిపించబోతున్నారు..వైసీపీ కి తిరుగులేదు..ఇలా 15 రోజుల క్రితం వరకు సీఎం జగన్ దగ్గరి నుండి కింది స్థాయి నేతల వరకు అంత చెప్పుకుంటూ వచ్చారు..కానీ ఇప్పుడు వారందరిలో ఓటమి భయం పట్టుకుంది. ప్రజలంతా కూటమి వైపే మొగ్గు చూపిస్తుండడం..కూటమి అభ్యర్థులు ప్రచారంలో వైసీపీ నేతలు చేసిన నేరాలు , కబ్జాలు , దారుణాలన్నీ ప్రజలను వివరిస్తూ వస్తుండడంతో ప్రజలంతా ఈసారి కూటమికే మా మద్దతు అని తేల్చి చెపుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. దీనికంతటికి కారణం తాడేపల్లి ప్యాలెస్‌ లో వాస్తు దోషం అని చాలామంది చెప్పడం తో.. జగన్ వాస్తు నిఫుణులను రప్పించి దోషాలను పరిష్కరించే పనిలో పడ్డారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ (Tadepalli House)లో ఉండి.. వాస్తు (Vastu ) నిఫుణులతో చర్చించారట. ఇళ్లంతా తిరిగి ఈశాన్యంగా బరువు పెరిగిందని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని వారు చెప్పారట. అందుకు కొన్ని సూచనలు చేయడంతో వెంట వెంటనే పని మొదలుపెట్టారని తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కట్టిన ఇనుప కంచెను ఈశాన్యంలో కొంతభాగం తొలగించాలని వాస్తు నిపుణులు చెప్పడంతో వెంటనే దాన్ని తొలగించడం చకచకా జరిగిపోయిందని క్యాంపు కార్యాలయం వర్గాలు అంటున్నాయి. కార్మికులు ఇంటికి వచ్చి పనులు చేయడం, వాటిని దగ్గరుండి సీఎం జగన్ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఇకపై అంతా బాగానే ఉంటుందని వైసీపీ అధినేత జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వాస్తు సరిచేసినంత మాత్రాన వెంటనే కలిసివస్తుందా అని ఈ వార్త తెలిసిన వారు అంటున్నారు. ఎన్నికల పోలింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నాయని, ఈ వారంలో ఆయా సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందా..? ఇలా జరిగితే ప్రతి ఒక్కరు తమ ఇంటిని మార్చుకునే పనిలోనే ఉంటారని చెపుతున్నారు. మరి నిత్యం యాగాలు చేసే కేసీఆర్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని..పదేళ్ల పాటు తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసిన ఆయన్నే అక్కడి ప్రజలు ఓడించారని..అలాంటిది ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ను ఓడించకుండా ఉంటారా అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి జగన్ లో మాత్రం ఓటమి భయం మొదలైందనేది సత్యం అని ప్రతి ఒక్కరు అంటున్న మాట.

Read Also : Petrol Bikes: అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లు ఇవే.. ధ‌ర కూడా త‌క్కువే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • Jagan tadepalli house
  • Vastu changes
  • ycp

Related News

Anitha Jagan

పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

YCP బాధ్యత లేని పార్టీగా తయారైందని మంత్రి అనిత మండిపడ్డారు. యువకులను రౌడీమూకలుగా మారుస్తోందని ఆరోపించారు

  • Pawan Amaravati

    వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

Latest News

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

  • సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd