Vanga Geetha Counter To Pawan Kalyan : పవన్వి దింపుడు కళ్లెం ఆశలే అని ఎద్దేవా చేసిన వంగా గీత
తాను కూడా పవన్ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రస్తావించారు
- By Sudheer Published Date - 12:15 PM, Wed - 20 March 24
ఏపీలో ఎన్నికల హోరు రోజు రోజుకు మరింత వేడెక్కుతుంది. మే 13 న పోలింగ్ జరగబోతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram ) బరిపైనే అంత ఆసక్తి నెలకొంది. దీనికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తుండటమే. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందిన పవన్..ఈసారి పిఠాపురం ఎంచుకోవడం ఫై అందరు ఈ స్థానం పైనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి సర్వేలు చూస్తే పవన్ కళ్యాణ్ కే జై కొడుతున్నప్పటికీ..ఎన్నికల పోలింగ్ సమయానికి ఏదైనా జరగొచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో పిఠాపురంలో పోటీ చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంగా గీత (Vanga Geetha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే తానేనని, వంగా గీత ప్రజారాజ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారని, భవిషత్తులో ఆమె జనసేనలో చేరితే బాగుంటుందని పిలుపునిచ్చారు. వైసీపీ నేతల దగ్గర చాలా డాబులున్నాయని, తనను ఓడించటానికి కోట్లు కోట్లు ఖర్చు పెడతారని, ఓటుకు లక్ష రూపాయలైనా ఇస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
అయితే పవన కళ్యాణ్ వ్యాఖ్యలపై కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత స్పందించారు. తాను కూడా పవన్ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రస్తావించారు. తాను 2009 కంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. ఇక 2009లో చిరంజీవి తనకి అవకాశం కల్పించారని.. ప్రజల ఆదరాభిమానాలతో తాను గెలుపొందినట్లు వెల్లడించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకే ఉందని పేర్కొన్నారు. పిఠాపురంలో గెలుపుపై పవన్వి దింపుడు కళ్లెం ఆశలే అని ఎద్దేవ చేశారు.
Read Also : CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
Related News
Pawan Kalyan : ఆ విషయం ఈసారి పవన్ వైపే అంట..!
ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడ పోటీ చేయడంతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది.