Praja Galam : చిలకలూరిపేట సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేసిన కూటమి
- By Sudheer Published Date - 04:04 PM, Fri - 15 March 24
త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల పంపకం..అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యాయి. ఇక ప్రజల్లోకి మూడు పార్టీలు కలిసి వెళ్లడమే ఆలస్యం. దానికి కూడా సిద్ధం అయ్యాయి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటికే ఈ సభకు సంబదించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. టిడిపి, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ బహిరంగ సభకు ‘ప్రజాగళం’ (Praja Galam) పేరును ఖరారు చేశారు. ఆదివారం మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ (PM Modi) హాజరుకాబోతున్నారు. అప్పుడెప్పుడో 2014 లో చంద్రబాబు (Chandrababu) , మోడీ , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు కలిసి వేదికగా పంచుకోగా..ఇప్పుడు ముగ్గురు కలిసి వేదికను పంచుకోబోతున్నారు. సభా ప్రాంగణం 140 ఎకరాలు కాగా, పార్కింగ్కి 60 ఎకరాలు కేటాయించారు. ఈ సభకు 10 లక్షల పైచిలుకు బీజేపీ-టీడీపీ-జనసేన తరపున కార్యకర్తలు హాజరవుతారని సమాచారం.
Read Also : YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి
Related News
Casting Multiple Votes: బీజేపీ అభ్యర్థికి 8 సార్లు ఓటు వేసిన వీడియో వైరల్
ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఒకే వ్యక్తి పలు ఓట్లు వేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు యువ ఓటరును అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీతో సహా అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసి