HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chandrababu Naidu To Be Serious On Survey Results

AP Politics: 2024లో చంద్ర‌బాబు విశ్వ‌రూపం

`పార్టీ కోసం త్యాగాలు చేయాలి. మీ కోసం పార్టీ త్యాగం చేయ‌దు` అంటూ చంద్ర‌బాబు కొత్త ఫార్ములా ను అందుకున్నారు. ఏ మాత్రం ఓడిపోతార‌ని స‌ర్వేలో తేలితే, సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేయ‌డానికి ఆయన సిద్ధం అయ్యారు.

  • By CS Rao Published Date - 12:09 PM, Wed - 7 September 22
  • daily-hunt
CBN Vision 2024
Chandrababu

`పార్టీ కోసం త్యాగాలు చేయాలి. మీ కోసం పార్టీ త్యాగం చేయ‌దు` అంటూ చంద్ర‌బాబు కొత్త ఫార్ములా ను అందుకున్నారు. ఏ మాత్రం ఓడిపోతార‌ని స‌ర్వేలో తేలితే, సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేయ‌డానికి ఆయన సిద్ధం అయ్యారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్షను కొన‌సాగిస్తోన్న ఆయ‌న కొంద‌రికి ఖ‌రాకండిగా టిక్కెట్ ఇవ్వ‌న‌ని చెప్పేశార‌ట‌. అంతేకాదు, దొంగ‌నాట‌కాలు కుద‌రద‌ని హెచ్చ‌రించార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీని పెట్టిన ఆరు నెల‌ల్లోనే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఆనాడు (1983లో) ఎవ‌రూ క‌ష్ట‌ప‌డ‌కుండా ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. రాజ‌కీయాల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యంలేని పెద్ద‌ బ్యాచ్ ను ఎన్టీఆర్ ఆనాడు చ‌ట్ట‌స‌భ‌ల‌కు తీసుకొచ్చారు. ఆయ‌న చ‌రిష్మా మీద రాజ‌కీయాల‌ను న‌డిపారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు చేతికి పార్టీ వ‌చ్చింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో 1999లో మాత్ర‌మే ఆయ‌న పార్టీని అధికారంలోకి తీసుకురాగ‌లిగారు. ఆ త‌రువాత జ‌రిగిన 2004 ఎన్నిక‌ల నుంచి వ‌రుస ఓట‌ముల‌తో ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ సంక్షోభంలోకి వెళ్లింది.

Also Read:    NEET 2022 Results : నీట్ 2022 ఫలితాలు విడుదల‌.. స‌త్తా చాటిన తెలుగు విద్యార్థులు

ప్ర‌తిప‌క్షనేత‌గా 2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు ఎదురీదారు. ఆ స‌మ‌యంలో దేవెంద‌ర్ గౌడ్‌, య‌న‌మ‌ల‌, క‌డియం, మందాజ‌గ‌న్నాథం, నాగం జ‌నార్థ‌న్ రెడ్డి, పెద్దిరెడ్డి, తుమ్మ‌ల‌, క‌ర‌ణం బ‌ల‌రాం, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ప్ర‌త్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస‌రావు త‌దిత‌ర సీనియ‌ర్లు పెద్ద‌గా ఆయ‌న‌తో క‌లిసి న‌డ‌వ‌లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రులుగా వెల‌గ‌బెట్టిన లీడ‌ర్లు ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత పోరాడేత‌త్త్వాన్ని మ‌రిచిపోయారు. ఎవ‌రికి వారే త‌ప్పించుకునేలా వ్య‌వ‌హరించే వాళ్లు. ఎప్పుడూ చంద్ర‌బాబు ఒంటరి పోరాటం చేయాల్సి వ‌చ్చేది. పైగా ప్ర‌త్యేక రాష్ట్రం గురించి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లేఖ ఇచ్చే విష‌యంలోనూ ఇరు రాష్ట్రాల సీనియ‌ర్లు కొంద‌రు ఆయ‌న్ను త‌ప్పుదోవ ప‌ట్టించారు.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత చంద్ర‌బాబు అనుభ‌వానికి ఏపీ ప్ర‌జ‌లు 2014లో ప‌ట్టం క‌ట్టారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మ‌ళ్లీ కొత్త బ్యాచ్ (వ్యాపార‌వ‌ర్గం) ఆయ‌న్ను చుట్టేసింది. ఐదేళ్ల పాటు విలాసంగా అధికారాన్ని అనుభవించిన కొంద‌రు లీడ‌ర్లు ఇప్పుడు బ‌య‌ట‌కు రావడానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. మ‌రికొంద‌రు మీడియాకు ప‌రిమితం అవుతున్నారు. ఇంకొందరు పార్టీ ఇచ్చే పిలుపును కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో ఇటీవ‌ల చంద్ర‌బాబు వాళ్ల మీద ఆగ్ర‌హించారు. నాట‌కాలు ఆడితే కుద‌ర‌ద‌ని ముఖంపైనే చెప్పేశార‌ట‌. ప‌నిచేయ‌కుండా ఉండే వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌లేన‌ని తేల్చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ పోరాడేందుకు సిద్ధంగాలేని నాయ‌కులు ఇప్ప‌టికీ ఇళ్ల‌లోనే త‌ల‌దాచుకుంటున్నారు.

Also Read:   Jagananna Sports Club APP : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తాజా స‌ర్వేల క్ర‌మంలో కొంద‌రు ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. చైత‌న్యంగా ఉండే గుంటూరు జిల్లా లాంటి చోట కొంద‌రు లీడ‌ర్లు ఇప్ప‌టికీ ధైర్యంగా ముందుకు రావ‌డానికి ద‌డుస్తున్నారు. మంత్రులుగా చెలామ‌ణి అయిన వాళ్లు మొఖం చాటేస్తూ రాజ‌కీయాన్ని నైస్ గా న‌డుపుతున్నారు. అలాంటి వాళ్ల‌ను గుర్తించిన టీడీపీ అధిష్టానం మాజీ మంత్రుల‌కు సైతం టిక్కెట్లను తిర‌స్క‌రించ‌డానికి సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. నిజంగా చంద్ర‌బాబు అలాంటి ధైర్యం చేస్తారా? అనేది చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • ap politics
  • TDP chandrababu naidu
  • telugu desam party

Related News

CM Chandrababu

Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు

    Latest News

    • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

    • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

    • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

    • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

    • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd