TDP BC Declaration : 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్
- By Sudheer Published Date - 07:51 PM, Tue - 5 March 24
అధికారంలోకి రాగానే 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు టీడీపీ. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై ఈ ప్రకటన చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. అందులో మొదటిగా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి జోరు పెంచింది. ఇప్పటికే ‘రా కదలి రా..’, ‘శంఖారావం’ కార్యక్రమాలతో ప్రజల్లో నిలుస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం బీసీ డిక్లరేషన్ను విడుదల చేసింది. వెనకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి, పూర్తి స్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా నేడు బీసీ డిక్లరేషన్ ను ప్రకటించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై రెండు పార్టీల అధినేతలు డిక్లరేషన్ ఆవిష్కరించాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, సబ్ప్లాన్ నిధులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Read Also : Byreddy Shabari : టీడీపీలోకి బైరెడ్డి శబరి..? నంద్యాల నుంచి పోటీ..?
Related News
Pawan Kalyan: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జనసేన అధినేత, సినీ నటుడు ఎమోషన్ అయ్యారు. ‘‘సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం , అభివృద్ది , శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు’’ అంటూ రియాక్ట్ అయ్యారు. ‘‘అత్యధికంగా 81.86% ఓటర్లు