Pawan Kalyan: పొత్తుపై అదే ఆప్షన్!వారాహి ఆగదు!!
ఏపీ ఎన్నికల పొత్తుపై మరో సారి పవన్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ కాదన్న ఓట్లు చీలిపోకుండా ఆప్షన్ తీసుకుంటానని పరోక్షంగా టీడీపీ తో పొత్తు సంకేతాలు ఇచ్చారు.
- By CS Rao Published Date - 05:44 PM, Sun - 18 December 22
Pawan Kalyan: ఏపీ ఎన్నికల పొత్తుపై మరో సారి పవన్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ కాదన్న ఓట్లు చీలిపోకుండా ఆప్షన్ తీసుకుంటానని పరోక్షంగా టీడీపీ తో పొత్తు సంకేతాలు ఇచ్చారు. వైసీపీ ని దించటమే లక్ష్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. అందుకోసం వారాహీలో వస్తా..ఆపటానికి సీఎంను రమ్మనండి అంటూ సవాల్ చేశారు. ఏపీ రోడ్ల పైన తన వారాహీతోనే వస్తానని పవన్ ప్రకటించారు. ఎవరైతే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారో వాళ్లు వారాహిని ఆపే ప్రయత్నం చేస్తే తానేంటో తెలుస్తుందని పవన్ హెచ్చరించారు. తాను తప్పు చేస్తే నా చొక్క పట్టండంటూ పవన్ పేర్కొన్నారు. వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని చెప్పిన పవన్, వారానికి ఒకసారి వస్తేనే తనను తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
జనసేనకు అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన ఇస్తామని పవన్ చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు చీలకుండా చేయడమే లక్ష్యమన్నారు. ప్రజలకు తప్ప ఎవరికీ కొమ్ము కాయనని స్పష్టం చేసారు. ఏపీ కోసం వ్యూహం ఉంటుందని వివరించారు. వైసీపీ ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరించబోతోందో తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఎవరూ భయపడవద్దని తాను అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. ఎవరికీ కొమ్ము కాయనని తేల్చి చెప్పారు. వ్యూహం తనకు వదిలేయమని చెబుతూ జనసేన అధికారంలోకి వస్తుందన్నారు. కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే ఏపీ భవిష్యత్ అంధకారమవుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి గెలవకుండా చూసే బాధ్యత తనదేనని పవన్ స్పష్టం చేసారు. 2019 ఎన్నికల్లో తిరిగి 2014 తరహాలో పొత్తులతో పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచేది కాదన్నారు. ఒక వేళ గెలిచినా,బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉండేదన్నారు. తాను మద్దతిచ్చినా టీడీపీని నిలదీసానని గుర్తు చేసారు. తనకు ఎటువంటి ఆశలు లేవన్నారు. ప్రజలకు మేలు చేయటమే లక్ష్యమని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ హింసకు దిగుతుందని ఆరోపించారు. జనసైనికుల కోసం రక్తం చిందించటానికైనా, .జైలుకు వెళ్లటానికైనా సిద్దమని పవన్ చెప్పుకొచ్చారు. తాను ఎవరి కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అధికారం చూడని కులాలకు అధికారం ఇవ్వటమే తన లక్ష్యమని పవన్ స్పష్టం చేసారు.
Related News
Allu Arjun : అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం.. పుష్ప 2కి పెనుముప్పుగా మారిందా..?
అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం పుష్ప 2కి పెనుముప్పుగా మారబోతుందా..? గతంలో కూడా ఇలాగే జరిగి..