HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Chittoor District

Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మృతి

8 Dead and Several Injured after Lorry and Bus Collided in Chittoor : రెండు లారీలు బస్సు (BUS) ను ఢీ కొట్టడం తో స్పాట్ లో ఎనిమిది మంది చనిపోయారు.

  • Author : Sudheer Date : 13-09-2024 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bus Lorry Collision
Bus Lorry Collision

8 Dead and Several Injured after Lorry and Bus Collided in Chittoor : చిత్తూరు జిల్లాలో(Chittoor District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రెండు లారీలు బస్సు (BUS) ను ఢీ కొట్టడం తో స్పాట్ లో ఎనిమిది మంది చనిపోయారు. పలమనేరు నియోజకవర్గం.. బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిఫై ఈ ప్రమాదం జరిగింది. సప్తగిరి ఆర్టీసీ బస్సు చిత్తూరు నుంచి పలమనేరు(Palamaner) వెళ్తుండగా.. పలమనేరు నుంచి ఇనుప రాడ్స్ లోడ్ తో వస్తున్న లారీ(Lorry) ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు ను ఢీ కొట్టగా..అదే సమయంలో వెనుక నుండి మరో లారీ బస్సు ను ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల మధ్య బస్సు నుజ్జునుజ్జయింది. ఆర్డీసీ బస్సు డ్రైవర్​తో పాటు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించారు.

ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని, గాయపడిన వారికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణాశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ (Minister Lokesh) సూచించారు. ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఈ ప్రమాదం కారణంగా ఆ రూట్ లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

Read Also : CM Revanth Reddy : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్ : అధికారులకు సీఎం ఆదేశాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8 Dead
  • Bus-Lorry Collision
  • Chittoor road accident

Related News

    Latest News

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    • మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే 5 సంకేతాలీవే!

    • వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధ‌ర ఎంతో తెలుసా?

    Trending News

      • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

      • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

      • జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

      • 2026కు స్వాగతం ప‌లికిన న్యూజిలాండ్‌.. న్యూ ఇయ‌ర్‌కు తొలుత స్వాగ‌తం ప‌లికిన దేశం ఇదే!

      • నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిద‌ట‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd