HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Potti Sriramulu Sacrifice Andhra State Inspiration

CM Chandrababu : తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు

CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం - కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ - పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

  • By Kavya Krishna Published Date - 04:29 PM, Sun - 15 December 24
  • daily-hunt
Cm Chandrababu (4)
Cm Chandrababu (4)

CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన శ్రీరాముల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆయన పాడె మోయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి దయనీయమని, ఆ సమయంలో టంగుటూరు ప్రకాశం పంతులు, ఘంటసాల వంటి మహనీయులు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. శ్రీరాముల ఆత్మార్పణతో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన వివరించారు.

పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని, ఆయన త్యాగాలను భావితరాలకు గుర్తుండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజికవాది, మానవతావాది అయిన శ్రీరాములు, జాతి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అని ఆయన ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తుగా మరో తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో స్థాపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, నెల్లూరులో ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రజల సౌలభ్యం కోసం త్వరలో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు వాట్సాప్‌లో సమస్యలు తెలపగానే వెంటనే పరిష్కరించి, మళ్లీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, తమ 2047 స్వర్ణాంధ్ర విజన్ ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన కంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.

2025 మార్చిలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. “మహనీయులను గుర్తుంచుకోవడం ఎంత అవసరమో, చెడువారిని గుర్తించడం కూడా అంతే అవసరం” అని చంద్రబాబు అన్నారు.

Read Also : Maharashtra Politics : ఈరోజు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. ఎవరెవరికి కాల్స్‌ వచ్చాయంటే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2047 Swarna Andhra Vision
  • andhra pradesh development
  • Andhra State Formation
  • chandrababu naidu
  • Indian Freedom Fighters
  • potti sriramulu
  • social reformers
  • Telugu University
  • WhatsApp Governance

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Cm Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్

  • CM Chandrababu

    CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd