HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Potti Sriramulu Sacrifice Andhra State Inspiration

CM Chandrababu : తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు

CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం - కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ - పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Author : Kavya Krishna Date : 15-12-2024 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu (4)
Cm Chandrababu (4)

CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన శ్రీరాముల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆయన పాడె మోయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి దయనీయమని, ఆ సమయంలో టంగుటూరు ప్రకాశం పంతులు, ఘంటసాల వంటి మహనీయులు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. శ్రీరాముల ఆత్మార్పణతో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన వివరించారు.

పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని, ఆయన త్యాగాలను భావితరాలకు గుర్తుండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజికవాది, మానవతావాది అయిన శ్రీరాములు, జాతి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అని ఆయన ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తుగా మరో తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో స్థాపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, నెల్లూరులో ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రజల సౌలభ్యం కోసం త్వరలో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు వాట్సాప్‌లో సమస్యలు తెలపగానే వెంటనే పరిష్కరించి, మళ్లీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, తమ 2047 స్వర్ణాంధ్ర విజన్ ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన కంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.

2025 మార్చిలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. “మహనీయులను గుర్తుంచుకోవడం ఎంత అవసరమో, చెడువారిని గుర్తించడం కూడా అంతే అవసరం” అని చంద్రబాబు అన్నారు.

Read Also : Maharashtra Politics : ఈరోజు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. ఎవరెవరికి కాల్స్‌ వచ్చాయంటే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2047 Swarna Andhra Vision
  • andhra pradesh development
  • Andhra State Formation
  • chandrababu naidu
  • Indian Freedom Fighters
  • potti sriramulu
  • social reformers
  • Telugu University
  • WhatsApp Governance

Related News

Chandrababu Naidu

Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాలు మహిళా బిల్లు విషయంలో చేసిన ద్రోహాన్ని ఎండగడతామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం మరియు ఎన్డీయే కూటమి ప్రధాన అజెండా అని, బిల్లు వీగిపోయినా తమ పోరాటం ఆగదని స్పష్టం

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd