Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్
Vallabhaneni Vamsi : రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో, ఆయనను సీఐడీ కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు
- Author : Sudheer
Date : 24-02-2025 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో జైల్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)పై పోలీసులు పీటీ వారెంట్ (PT Warrant) జారీ చేశారు. రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో, ఆయనను సీఐడీ కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని కేసులను తిరిగి తెరవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీనితో వంశీపై మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
పోలీసులు ప్రాసిక్యూషన్ వర్గాలు పీటీ వారెంట్ను సాధారణంగా కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదైనప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తారు. ఇది వ్యక్తిని విచారణకు హాజరుపరచడానికి తీసుకునే ముందస్తు చర్యగా ఉంటుంది. వల్లభనేని వంశీ ఇప్పటికే ఉన్న కేసులో రిమాండ్లో ఉండగా, ఇప్పుడు కొత్త కేసులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన వివాదాస్పద ఘటనలపై విచారణను ముమ్మరం చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వైసీపీ వర్గాలు దీనిని ప్రస్తుత ప్రభుత్వ కక్షసాధింపుగా చూస్తుండగా, టీడీపీ వర్గాలు మాత్రం న్యాయపరమైన ప్రక్రియగానే వివరిస్తున్నాయి. రేపటితో వంశీ రిమాండ్ ముగియనుండటంతో తదుపరి కార్యాచరణ ఏమిటో చూడాల్సి ఉంది.