HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Polavaram Finance Central Assistance Under Fiscal Deficit To Ap Rs 10500 Crore Behind Polavaram Compression Conspiracy

Polavaram Finance : కేంద్ర ఆర్థిక స‌హాయం వెనుక `పోల‌వ‌రం` కుట్ర‌

Polavaram Finance : ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక లోటు కింద  రూ. 10వేల 500 కోట్ల‌ను ను కేంద్రం విడుద‌ల చేసింది.

  • By CS Rao Published Date - 02:04 PM, Wed - 24 May 23
  • daily-hunt
Polavaram Finance
Polavaram Finance

Polavaram Finance : ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక లోటు కింద  రూ. 10వేల 500 కోట్ల‌ను ను కేంద్రం విడుద‌ల చేసింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం పండ‌గ చేసుకుంటోంది. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న ప్ర‌భుత్వానికి ఇంత పెద్ద మొత్తం ఊరట కింది చెప్పుకోవాలి. కానీ, దీని వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని ఆర్థిక నిపుణులు బ‌య‌ట‌పెడుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టుకు(Polavaram Finance) ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెడుతూ ఈ నిధులు ఇచ్చార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే, కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీ మీద పెద్ద కుట్ర‌కు తెర‌లేపినట్టే.

ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక లోటు కింద  రూ. 10వేల 500 కోట్ల‌ (Polavaram Finance)

ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టుగా పోల‌వ‌రం ఉంది. ఆ ప్రాజెక్టును(Polavaram Finance)కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి దాని నిర్మాణ ప‌నుల‌ను అప్ప‌గించింది. దాన్ని ఏటీఎంగా ఆనాటి ప్ర‌భుత్వం వాడుకుంద‌ని రాజ‌కీయ ప్ర‌చార స‌భ‌ల్లో మోడీ ఆరోపించారు. ఆ త‌రువాత మోడీకి ఇష్ట‌మైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి పోల‌వ‌రం ప‌నులు రివ‌ర్స్ తీసుకున్నాయి. ఎత్తు త‌గ్గించ‌డానికి కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ఎత్తు త‌గ్గించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రిస్తే, ఖ‌ర్చు రూపంలో భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి కేంద్రం ఎత్తుగ‌డ వేసింది. క‌నీసం 10వేల కోట్ల‌కు పైగా కోత పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ఆ విష‌యాన్ని వెలుగొత్తింది. పోల‌వ‌రం ఎత్తుత‌గ్గించ‌డానికి లేద‌ని డిమాండ్ చేసింది.

కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీ మీద పెద్ద కుట్ర‌

ఒక వేళ పోల‌వ‌రం ఎత్తు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంటే రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని గుట్టుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) స‌ర్కార్ చేస్తోంది. కేంద్రం అడుగులకు మ‌డుగులు ఒత్తుతోంది. పోల‌వ‌రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు డిజైన మార్చ‌డానికి లోపాయికారిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంగీక‌రిస్తూ వారం క్రితం సంత‌కాలు పెట్టార‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే, 2014 -15వ ఆర్థిక సంవ‌త్స‌రం ఆర్థిక లోటు కింద ఇప్పుడు రూ. 10వేల 500 కోట్లు కేంద్రం విడుద‌ల చేసింద‌ని చెబుతున్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా పోల‌వ‌రం ప్రాజెక్టు (Polavaram Finance)నిర్మాణ వ్య‌యాన్ని త‌గ్గించుకునేలా కేంద్రానికి ప‌త్రాలు ఇచ్చిన త‌రువాత ఇదంతా జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Polavaram : KCR చెప్పిన‌ట్టే కేంద్రం! పోల‌వ‌రం ఎత్తు కుదింపు!

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత పోల‌వ‌రంను 2021నాటికి పూర్తి చేస్తామ‌ని అసెంబ్లీ వేదిక‌గా చెప్పారు. ఆనాడున్న ఇరిగేష‌న్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత 2022 అన్నారు. ప్ర‌స్తుత నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ఎప్పుడు పూర్తి అవుతుందో ఇతిమిద్ధంగా చెప్ప‌లేమ‌ని ప్ర‌క‌టించారు. గ‌త చంద్ర‌బాబునాయుడు డ‌యాఫ్రం వాల్ నిర్మాణం విష‌యంలో చేసిన సాంకేతిక‌లోపం కార‌ణంగా ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్ప‌లేమ‌ని బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. మీడియా స‌మావేశాల్లో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం గురించి అడిగితే క‌రిచేలా అంబ‌టి విలేక‌రుల‌కు స‌మాధానం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల న‌డుమ రూ. 10వేల 500కోట్లు ఆర్థిక లోటు కింద విడుద‌ల చేసిన కేంద్రం ఉదార‌తపై అధ్య‌య‌నం చేయ‌గా, పోల‌వ‌రం(Polavaram Finance) కుదింపు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజీప‌డ్డార‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వాలు పూర్తిగా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

Also Read : Polavaram Issue: పోలవరం ఆలస్యానికి అసలు కారణమిదే!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp vs ycp
  • financial assistance
  • jaganmohan reddy
  • pm modi
  • polavaram dam

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

  • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd