Pawan Kalyan Properties : ఎన్నికల కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్..?
- By Sudheer Published Date - 03:41 PM, Tue - 27 February 24
ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే డబ్బే ప్రదానం. డబ్బు ఎంత ఖర్చు చేస్తే అంత పేరు , గెలుపు ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవ్వరు పట్టించుకోరు..ఎన్నికల ప్రచారం లో ఎంత ఖర్చుపెట్టాం..ఎన్ని మందుసీసాలు పంపిణి చేసాం..ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పంచాం..ఎంతమందిని వెనకేసుకొని తిరిగాం అనేది ఓటర్లు చూస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి పోలింగ్ పూర్తి అయ్యేవరకు ఓటర్లకు , కార్యకర్తలకు , నేతలకు డబ్బు పంచుతూనే ఉండాలి. అప్పుడే గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే అంత గెలుపు అనేది ఉంటుంది. అందుకే ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి వందల కోట్లు పట్టుకొని నిల్చువాలి. అభ్యర్ధే ఆ రేంజ్ లో ఖర్చు చేయాలంటే..పార్టీ అధినేత ఎంత ఖర్చు పెట్టాలో ఓసారి ఆలోచించండి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ కోట్ల కోసం సొంత ఆస్తులు (Properties ) అమ్ముతున్నట్లు (Selling ) ఓ వార్త బయటకు వచ్చింది.
సినిమాల్లో రోజుకు రెండు కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్..ప్రజలకు ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుండి ఆయనకు మంచి కంటే చెడె ఎక్కువ జరుగుతుంది. పనికిరాని వారితో మాటలు పడాల్సి వస్తుంది..పదేళ్లుగా సినిమాలు చేస్తే వచ్చిన డబ్బుతో పార్టీ నడిపిస్తూ..ఆపదలో ఉన్న వారిని ఆర్ధికంగా ఆదుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల బరిలో నిల్చున్నాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన పవన్…ఇప్పుడు తన బ్యాంకు అకౌంట్ లో జీరో బాలన్స్ కు వచ్చే స్థితికి వచ్చాడు. పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు సిద్ధం చేస్తున్నాడట.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ..హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్లు తెలుస్తుంది. ఈ స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేసాడట. ఇదే తరహాలో మరికొన్ని స్థలాలను అమ్మడానికి పవన్ బేరాలు మొదలుపెట్టారట. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు… ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. గత నెలలోనే పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు. ఇప్పుడు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయన భరించాలని డిసైడ్ అయ్యాడట. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పాడట. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారు.
ఇలా పార్టీ కోసం సొంత ఆస్తులను అమ్మే స్థితికి పవన్ చేరుకోవడం అబిమానులను ఆవేదనకు గురి చేస్తుంది. మాములుగా ఈరోజుల్లో సర్పంచ్ వ్యక్తులే లక్షల కొద్దీ సంపాదిస్తుంటే..పవన్ మాత్రం ఉన్న డబ్బును పోగొట్టుకుంటున్నాడట. ఇలాంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ అని ఎలా అనాలనిపిస్తుందో అని అంత వాపోతున్నారు. నిజంగా ప్యాకేజ్ తీసుకునే ఇలా సొంత ఆస్తులు అమ్మవాల్సిన అవసరం ఏముంటుంది..? పిల్లల కోసం దాచిన డబ్బులు ఎందుకు తీయాల్సి వస్తుందని..? అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా హైపర్ ఆది కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
Read Also : Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది
Related News
Laya : పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్, రోజా గారిలా కాదు.. నటి లయ కామెంట్స్ వైరల్..
పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్, రోజా గారిలా కాదు అంటున్న నటి లయ. రీసెంట్ ఇంటర్వ్యూలో పవన్ గురించి లయ చేసిన కామెంట్స్ వైరల్.